హైదరాబాదులో దారుణం : లాడ్జీలో బాలికపై రెండు రోజులపాటు గ్యాంగ్ రేప్..

By Bukka SumabalaFirst Published Sep 15, 2022, 9:17 AM IST
Highlights

హైదరాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, ఆమె మీద రెండురోజులపాటు సామూహిక అత్యాచారం చేశారు. 

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పాతబస్తీలో దారుణమైన సంఘటన జరిగింది. మైనర్ బాలికను కిడ్పాప్ చేసిన యువకులు ఓ లాడ్జీలో సామూహిక అత్యాచారం చేశారు. ఈ సంఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితులు బాలికను లాడ్జీకి తీసుకుని వెళ్లి మత్తుమందు ఇచ్చారు. 

ఆ తర్వాత రెండు రోజుల పాటు ఆమెపై సామూహిక అత్యాచారం జరిపారు. ఆ తర్వాత ఆమెను లాడ్జీలోనే వదిలేసి వెళ్లిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో యువకుడు పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

టీఆర్ఎస్ నేత అరెస్ట్.. తల్వార్లు, డమ్మీ తుపాకీతో బెదిరించి భూములు లాక్కున్న కేసులో..

ఇదిలా ఉండగా, ఆగస్ట్ 27న తమిళనాడులో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. తల్లిదండ్రులతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిన 14 ఏళ్ల బాలికను ఆటోరిక్షా డ్రైవర్ కిడ్నాప్ చేసి లైంగికంగా వేధించిన ఘటన ఆవడిలో చోటుచేసుకుంది. నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఇటీవల బాధిత బాలిక కుటుంబం నగరానికి వలస వచ్చింది. అయితే, నగరానికి వచ్చిన తరువాత బాలిక స్కూలుకు వెళ్లడానికి ఇష్టంలేదు. దీంతో స్కూల్ కు వెళ్లమని తల్లిదండ్రులు చెప్పడంతో వారితో బాలిక గొడవపడింది. అదే క్రమంలో ఘటన జరిగిన రోజు సాయంత్రం కూడా తల్లిదండ్రులతో బాలిక గొడపడిందని పోలీసులు తెలిపారు. 

ఆ తరువాత తల్లిదండ్రులు ఏదో పనిమీద బయటకు వెళ్లడంతో.. అప్పటికే కోపంతో, మనస్తాపంతో ఉన్న బాలిక.. తాను ఆత్మహత్య చేసుకుంటానని తన చెల్లెలికి చెప్పి రాత్రి 8 గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు తిరిగి వచ్చిన తర్వాత ఆ చిన్నారి ఈ విషయాన్ని వారికి చెప్పింది. దీంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు..ఆమెను వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో పట్టాబిరంలోని టీచర్స్ కాలనీకి చెందిన ఆటోరిక్షా డ్రైవర్ రామకృష్ణన్ (38) రాత్రి 9 గంటల సమయంలో బాలిక ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళడాన్ని గమనించాడు. ఆమెకు లిఫ్ట్ ఇస్తానని చెప్పి డ్ట్రైవర్ తన ఆటో లో ఎక్కించుకున్నాడు. 

దారుణం.. పన్నెండేళ్ల బాలికపై వైసీపీ కార్యకర్త అత్యాచారయత్నం..

నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే, అతని బారినుంచి బాలిక తప్పించుకుని, పారిపోతూ రోడ్డుపై ఒక మహిళను కలుసుకుంది. మహిళ ఆమెను సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లింది.ఈ ఘటనపై ఆవడి అన్ని మహిళా పోలీసులకు సమాచారం అందించారు. అంతేకాదు బాలిక చెప్పిన వివరాలతో నేరస్థుడిని పట్టుకోవడానికి పోలీసులు 20 సిసిటివి ఫుటేజీలను తనిఖీ చేశారు. బాధితురాలు అందించిన సమాచారం ఆధారంగా, చుట్టుపక్కల ఉన్న సిసిటివి కెమెరా ఫుటేజీని పరిశీలించిన తరువాత, పోలీసులు రామకృష్ణను నిందితుడిగా గుర్తించారు. పోక్సో (లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ) చట్టం కింద తీవ్రమైన లైంగిక వేధింపుల అభియోగంపై పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. అతడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

click me!