కేసీఆర్‌వి అన్నీ అబద్దపు కూతలే, నిరూపిస్తే సన్యాసం: జానా

By narsimha lodeFirst Published Oct 4, 2018, 6:12 PM IST
Highlights

వ్యవసాయానికి 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తే  తాను టీఆర్ఎస్‌కు ప్రచారం చేస్తానని   చెప్పినట్టుగా నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకొంటానని మాజీ మంత్రి జానారెడ్డి  కేసీఆర్‌కు సవాల్ విసిరారు.
 

ఆలంపూర్: వ్యవసాయానికి 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తే  తాను టీఆర్ఎస్‌కు ప్రచారం చేస్తానని   చెప్పినట్టుగా నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకొంటానని మాజీ మంత్రి జానారెడ్డి  కేసీఆర్‌కు సవాల్ విసిరారు.

గురువారం నాడు  ఆలంపూర్‌లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభలో  ఆయన పాల్గొన్నారు. నిరంతరంగా విద్యుత్‌ను సరఫరా చేస్తే  టీఆర్ఎస్‌కు ప్రచారం చేస్తాననని తాను ఎక్కడ చెప్పానో రుజువు చేయాలని జానారెడ్డి సవాల్ చేశారు.  ఈ విషయాన్ని రుజువు చేస్తే  తాను రాజకీయ సన్యాసం తీసుకొంటానని జానారెడ్డి సంచలన ప్రకటన చేశారు.

కేసీఆర్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా మోసం చేశాడని విమర్శించారు.కేసీఆర్‌ నియంత పాలన కొనసాగిస్తున్నారని.. ఎవరు ప్రశ్నించిన అణచివేస్తున్నాడని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ అన్నీ అబద్దాలు మాట్లాడుతున్నారని  ఆయన విమర్శించారు. 

 ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుల, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు.టీడీపీ, కాంగ్రెస్‌ పొత్తుపై మాట్లాడుతున్న కేసీఆర్‌.. ఇంతకుముందు టీడీపీతో పొత్తు పెట్టుకున్న విషయాన్ని గమనించాలని ప్రజలను కోరారు

సంబందిత వార్తలు

ఎందుకో చెప్పాల్సిందే: కేసీఆర్‌కు విజయశాంతి సవాల్

కత్తి దూసిన జానా: రాములమ్మ, జేజమ్మల విన్యాసాలు

వైఎస్ సెంటిమెంట్‌కు తిలోదకాలు: నైరుతిని నమ్ముకొన్న కాంగ్రెస్

ఆలంపూర్ నుండి కాంగ్రెస్ పార్టీ ప్రచారం ప్రారంభం

శక్తిపీఠం సెంటిమెంట్: ఆలంపూర్ నుండి కాంగ్రెస్ ప్రచారం

ఆ స్థానాల్లో టీఆర్ఎస్‌కు చుక్కలు చూపుతాం: కొండా సురేఖ

6 నియోజకవర్గాల్లో కాదు కదా.. 6 డివిజన్లలో కూడా.. కొండాకు అంత సీన్ లేదు

సత్తా చూపుతాం: కాంగ్రెస్‌లో చేరిన కొండా దంపతులు

కొండా దంపతులు.. అందుకే అలా మాట్లాడుతున్నారు..వినయ్

దొరల కింద బతికేవాళ్లం కాదు.. సురేఖను లక్ష మెజారిటీతో గెలిపిస్తా: కొండా మురళీ

15 పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థిగా కొండా సురేఖ..?

నేను హరీశన్న వర్గం.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

click me!