దమ్ముంటే కొండాపై పోటీ చేయండి: కడియంకు కాంగ్రెస్ సవాల్

By narsimha lodeFirst Published Oct 2, 2018, 5:15 PM IST
Highlights

డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి  దమ్ముంటే పరకాల అసెంబ్లీ సెగ్మెంట్లో  కొండా దంపతులను ఢీకొట్టాలని  కాంగ్రెస్ పార్టీ నేత అచ్చ విద్యాసాగర్  సవాల్ విసిరారు.

వరంగల్: డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి  దమ్ముంటే పరకాల అసెంబ్లీ సెగ్మెంట్లో  కొండా దంపతులను ఢీకొట్టాలని  కాంగ్రెస్ పార్టీ నేత అచ్చ విద్యాసాగర్  సవాల్ విసిరారు.

కాంగ్రెస్ పార్టీ నేత విద్యాసాగర్ సోమవారం సాయంత్రం బహిరంగ లేఖను విడుదల చేశారు.  గతంలో కుట్రపన్ని తాటికొండ రాజయ్య నుండి కడియం శ్రీహరి డిప్యూటీ సీఎం పదవిని లాక్కొన్నారని ఆయన ఆరోపించారు. 

ఉద్యమకారులు ఆస్తులు పోగొట్టుకొంటే అడ్డదారిలో కడియం శ్రీహరి పదవి పొంది కోట్లు కూడబెట్టుకొన్నారని ఆయన విమర్శించారు.
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో టీఆర్‌ఎ్‌సలో గ్రూపు తగదాలను పెంచి పోషించడంలో కడియం శ్రీహరి కీలకంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
బండా ప్రకాశ్‌కు రాజ్యసభ సభ్యుడిగా పదవి ఇప్పించి ఉద్యమకారులకు శ్రీహరి ద్రోహం చేశారన్నారు. 

నన్నపునేని నరేందర్‌ను కార్పొరేటర్‌గా గెలిపించిన కొండా దంపతులను భయంతో పరిపోయారని శ్రీహరి వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందని లేఖలో విమర్శించారు.

సంబంధిత వార్తలు

"హరీ"ష్: కేటీఆర్ దే పెత్తనం, అసంతృప్తులకు బుజ్జగింపులు
పంచాయితీ: రాజయ్యకు వ్యతిరేకత, కడియం కూతురు కోసమేనా?

కనిపించకుండా పోయిన.. రాజయ్య ‘‘కొంటెపులి..చిలిపి పిల్ల’’..?

"కొంటెపులివి, చిలిపి పిల్లవి"... ఫోన్లో రాజయ్య రాసలీలలు.. మహిళతో అసభ్య సంభాషణ

కడియంకు రాజయ్య పాదాభివందనం.. ఎన్నికల్లో సహకరించాలని విన్నపం

రాజయ్యకి షాక్.. పెల్లుబుక్కుతున్న అసమ్మతి

మళ్లీ బోరున ఏడ్చేసిన రాజయ్య

click me!