అందుకే అమరావతి సహకారం: తేల్చేసిన రేవంత్

By narsimha lodeFirst Published Oct 1, 2018, 4:02 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఉన్న చిక్కుముడులను , సమస్యలను పరిష్కరించుకొనేందుకు అమరావతి సహకారాన్ని  కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకొంటుందని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చెప్పారు.


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఉన్న చిక్కుముడులను , సమస్యలను పరిష్కరించుకొనేందుకు అమరావతి సహకారాన్ని  కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకొంటుందని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చెప్పారు.

సోమవారం నాడు  ఆయన  హైద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.  టీఆర్ఎస్‌కు ఓటేస్తే  గడిలో నివసిస్తున్న దొపీడీదొరలకు ప్రయోజనం కలుగుతోందన్నారు.  టీఆర్ఎస్‌కు ఓటేస్తే  దొంగకు తాళం చేతులు ఇవ్వడమేనని రేవంత్ విమర్శలు గుప్పించారు.  

గతంలో దొంగలు గుట్టలు, గుహల్లో దాక్కొని గ్రామలపై దాడి చేసి దోపిడీ చేసేవారని, ఇవాళ కేసీఆర్ కుటుంబం దోపీడి దొంగల్లా తెలంగాణై దాడి చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 

ఏపీ రాష్ట్రంతో ఉన్న సమస్యలను  శాశ్వతంగా పరిష్కరించుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ అమరావతితో చర్చించనుందని ఆయన చెప్పారు. ఓటేసీ తెలంగాణ ప్రజలను దోచుకొనే  అధికారాన్ని కట్టబెడుతారా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి  అవసరమైతే ఏపీ సహకారాన్ని కూడ తీసుకొంటామని చెప్పారు. గబ్బర్ సింగ్ లాంటి వాడే కేసీఆర్ అని  రేవంత్ విమర్శించారు.

సంబంధిత వార్తలు

ఎమ్మెల్యే పదవుల కోసం బాబుకు తెలంగాణను తాకట్టు పెడతారా: కేటీఆర్

ఐటి దాడులు: ఉదయసింహ సంచలన ప్రకటన

కేసీఆర్ బాగోతం బయటపెట్టినందుకే దాడులు.. శవాలపై వ్యాపారం జరుగుతోంది: రేవంత్

రేవంత్ విచారణ: ఓటుకు నోటు కేసులో చంద్రబాబు టార్గెట్?

తప్పు చేస్తే జైలుకెళ్లాల్సిందే : రేవంత్ పై జగదీశ్ రెడ్డి

పెళ్లికి ముందే కోట్ల ఆస్తి ఉంది.. ఇప్పుడు అడిగితే ఎలా.. రేవంత్

ఐటి సోదాలపై రేవంత్ రెడ్డి స్పందన ఇదీ...

రేవంత్ ఇంట్లో ముగిసిన ఐటి సోదాలు: లెక్క చూపని ఆస్తులు రూ. 20 కోట్లు

కొనసాగుతున్న రేవంత్ విచారణ: ఆ కంప్యూటర్లో ఏముంది?

రేవంత్ భార్యతో లాకర్లు తెరిపించిన అధికారులు

 

click me!