బియ్యం ఇస్తానని చెప్పి.. మైనర్ బాలికపై రేప్

By ramya neerukondaFirst Published Jan 4, 2019, 9:52 AM IST
Highlights

బియ్యం ఇస్తానని చెప్పి.. ఏడేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో చోటుచేసుకుంది.


బియ్యం ఇస్తానని చెప్పి.. ఏడేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  దమ్మపేట మండలానికి చెందిన బాలిక(7)ను ఆమె తల్లి బియ్యంకోసం పొరుగున ఉండే మరో మహిళ ఇంటికి పంపింది. తల్లి చెప్పినట్లే చిన్నారి పొరిగింటికి వెళ్లింది. అయితే..  చిన్నారి వెళ్లిన సమయంలో సదరు మహిళ ఇంట్లో లేదు.  దీంతో.. ఆ మహిళ భర్తను బియ్యం కావాలని చిన్నారి అడిగింది.

ఇదే అదనుగా తీసుకున్న ఆ   మహిళ  భర్త బియ్యం ఇస్తానంటూ బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.  బియ్యం కోసమని వెళ్లిన కుమార్తె  ఎంతసేపైనా ఇంటికి రాకపోయేసరికి అనుమానం వచ్చిన ఆమె  తల్లి వెళ్లి చూడగా విషయం బయటపడింది. దీంతో వెంటనే ఆమె పోలీసులను ఆశ్రయించింది.

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. 

click me!