ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో టీం ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా.. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు టీం ఇండియా అమరవీరులకు నివాళులర్పించింది.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో టీం ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా.. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు టీం ఇండియా అమరవీరులకు నివాళులర్పించింది.
ఆర్మీ క్యాపులను ధరించి బరిలోకి దిగిన కోహ్లీ సేన.. ల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్లకు ఘనంగా నివాళులర్పించింది. టాస్ గెలిచిన కెప్టెన్ కోహ్లి ఫీల్డింగ్వైపు మొగ్గుచూపాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వీరజవాన్లు, వారి కుటుంబాలు దేశానికి చేసిన సేవకు చిహ్నంగా ఈ మ్యాచ్లో ఆర్మీక్యాప్లతో బరిలోకి దిగుతున్నట్లు తెలిపాడు. అలాగే ఈ మ్యాచ్ ఫీజును నేషనల్ డిఫెన్స్ ఫండ్కు విరాళంగా ప్రకటిస్తున్నట్లు ప్రకటించాడు. ఎలాంటి మార్పుల్లేకుండా అదే జట్టుతో బరిలోకి దిగుతున్నట్లు స్పష్టం చేశాడు.
మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. లెప్టనెంట్ కల్నల్ హోదా లో ఆటగాళ్లందరికీ ఆర్మీ క్యాప్లు అందజేశారు. ఈ వీడియోను బీసీసీఐ ట్వీట్ చేసింది. ఇక ఆటగాళ్ల మ్యాచ్ ఫీజును నేషనల్ డిఫెన్స్ ఫండ్ ద్వారా అమర జవాన్ల కుటుంబాల సంక్షేమానికి ఉపయోగిస్తామని ప్రకటించించింది.
will be sporting camouflage caps today as mark of tribute to the loss of lives in Pulwama terror attack and the armed forces
And to encourage countrymen to donate to the National Defence Fund for taking care of the education of the dependents of the martyrs pic.twitter.com/fvFxHG20vi