సిడ్నీ టెస్ట్: మ్యాచ్ డ్రా, ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన భారత్

By sivanagaprasad KodatiFirst Published Jan 7, 2019, 8:26 AM IST
Highlights

బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, భారత్‌ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్‌ డ్రా అయ్యింది. వర్షం కారణంగా మ్యాచ్ కొనసాగించేందుకు అవకాశం లేకపోవడంతో అంపైర్లు ఐదో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో మ్యాచ్ డ్రా గా ముగిసింది.

బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, భారత్‌ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్‌ డ్రా అయ్యింది. వర్షం కారణంగా మ్యాచ్ కొనసాగించేందుకు అవకాశం లేకపోవడంతో అంపైర్లు ఐదో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో మ్యాచ్ డ్రా గా ముగిసింది.

దీంతో భారత్ 2-1 తేడాతో ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆసీస్ గడ్డపై తొలిసారి టెస్ట్ సిరీస్ విజయం సాధించి టీమిండియా చరిత్ర సృష్టించింది. నిన్న రెండో ఇన్నింగ్స్‌ ఆడుతున్న ఆసీస్ ఆట ముగిసే సమయానికి 6 పరుగులు చేసింది.

క్రీజులో ఖవాజా, హారిస్ ఉన్నారు. అంతకు ముందు భారత్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 622 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ 300 పరుగులకు అలౌటై ఫాలో ఆన్ ఆడుతోంది.

దాదాపు 3 దశాబ్ధాల తర్వాత ఆస్ట్రేలియా జట్టు ఫాలో ఆన్ ఆడటం గమనార్హం. విజయంతో ఘనంగా సిరీస్‌ను ముగించాలనుకుంటున్న కోహ్లీసేనకు వాతావరణమే పెద్ద అడ్డంకిగా మారింది. 3-1 ఆశలకు గండికొట్టేలా ఉంది. వర్షం, వెలుతురులేమి కారణంగా సిడ్నీ టెస్టులో ఆదివారం 25.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.

 

72 ఏళ్ల నిరీక్షణ తర్వాత...ఆసీస్‌ను ఆసీస్ గడ్డపై ఓడించిన భారత్

సిడ్నీ టెస్ట్: ముగిసిన నాలుగోరోజు ఆట.. 322 పరుగుల వెనుకబడ్డ ఆసీస్

మరీ ఇంతటి పతనమా...30 ఏళ్ల తర్వాత ఫాలో ఆన్ ఆడుతున్న ఆసీస్

సిడ్నీ టెస్టు: రెండో ఇన్నింగ్సు ప్రారంభించిన ఆస్ట్రేలియా

‘‘పంత్.. ధోనీని దాటేస్తాడు’’

కేఎల్ రాహుల్ నిజాయితి... అంపైర్ ప్రశంసలు

సిడ్నీ టెస్టులో కోహ్లీకి అవమానం...

ఆసిస్ సెలెక్టర్లకు బుర్ర లేదు: విరుచుకుపడ్డ షేన్‌వార్న్

ధోని పాకిస్థాన్ రికార్డును బద్దలుగొట్టిన పంత్.... 12ఏళ్ల తర్వాత

click me!