టీం ఇండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. తనకు స్ఫూర్తి అని ముంబయి ఇండియన్స్ ఆటగాడు హార్దిక్ పాండ్యా అంటున్నాడు.
టీం ఇండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. తనకు స్ఫూర్తి అని ముంబయి ఇండియన్స్ ఆటగాడు హార్దిక్ పాండ్యా అంటున్నాడు. ఐపీఎల్ 2019లో భాగంగా మంగళవారం క్వాలిఫయర్ 1లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ తలపడిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్ సందర్భంగా ధోనీతో మాట్లాడుతుండగా.. పాండ్యా ఫోటోని క్యాప్చర్ చేశారు. ఆ ఫోటోని తన ట్విట్టర్ లో షేర్ చేసిన పాండ్యా... ధోనీపై తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.
My inspiration, my friend, my brother, my legend ❤🚁 pic.twitter.com/yBu0HEiPJw
— hardik pandya (@hardikpandya7)‘నా స్ఫూర్తి, నా స్నేహితుడు, నా సోదరుడు, నా లెజెండ్ ఈయనే.. ఎంఎస్ ధోనీ’ అని పాండ్య ట్వీట్ చేశారు. దీంతో పాటు ధోనీ హెలికాప్టర్ షాట్లను గుర్తుచేస్తూ హెలికాప్టర్ ఇమోజీని పెట్టారు. ఇదిలా ఉండగా.. నిన్న జరిగిన మ్యాచ్ లో చెన్నైని ఓడించి ముంబయి ఫైనల్స్ కి వెళ్లింది. కాగా.. మ్యాచ్ ఓడిపోయినప్పటికీ.. ఫైనల్ కి చేరుకోవడానికి చెన్నైకి ఇంకా ఒక ఛాన్స్ మిగిలే ఉంది.