టీం ఇండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కి ఆసిస్ సీనియర్ క్రికెటర్ మాథ్యూ హేడెన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు.
టీం ఇండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కి ఆసిస్ సీనియర్ క్రికెటర్ మాథ్యూ హేడెన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. తమ ఆస్ట్రేలియా జట్టు పసికూన కాదంటూ గుర్తు చేశారు. ఇంతలా మాథ్యూ హేడెన్.. వీరూపై సీరియస్ అవ్వడానికి కారణం ఏమిటో తెలుసా..? స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసిన ఓ వీడియో.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇటీవల స్టార్ స్పోర్ట్స్ ఓ వీడియోని విడుదల చేసింది. ఆ వీడియోలో వీరేంద్ర సెహ్వాగ్ బేబీ సిట్టర్ అవతారం ఎత్తారు. అందులో చిన్నారులు ఆస్ట్రేలియా జట్టు జెర్సీని వేసుకొని ఉండటం గమనార్హం. దీంతో.. దీనిపై మాథ్యూ సీరియస్ అయ్యాడు.
ప్రధానంగా ఆసీస్ జట్టు జెర్సీలతో యాడ్ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే ఆసీస్ను తేలిగ్గా తీసుకోవద్దు వీరూ అంటూ వార్నింగ్ కూడా ఇచ్చేశాడు. వరల్డ్కప్ వంటి మెగాటోర్నీలో ఎవరు బేబీ సిట్టర్స్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నాడు. ఆసీస్ ఏమీ పసికూన కాదనే సంగతిని తెలుసుకోవాలన్నాడు. ఈ మేరకు తన ట్విటర్ అకౌంట్ ద్వారా స్పందించిన హేడెన్.. యాడ్ చేసిన వీరేంద్ర సెహ్వాగ్ను, యాడ్ రూపొందించిన స్టార్ స్పోర్ట్స్లను ట్యాగ్ చేశాడు.
ఈ నెలాఖరులో ఆసిస్ జట్టు.. భారత పర్యటనకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ వీడియోని విడుదల చేయగా.. అదికాస్త వివాదానికి దారి తీసింది. ఈ వీడియోని ఈ కింద మీరు చూడొచ్చు.
Every baby needs a babysitter - 🇦🇺 and 🇮🇳 would remember this well! 😉
The Aussies are on their way and here's how is welcoming 'em! Watch Paytm Feb 24 onwards LIVE on Star Sports to know who will have the last laugh. pic.twitter.com/t5U8kBj78C