జనవరి15..మూడేళ్లుగా కోహ్లీకి కలిసొస్తున్న రోజు

By ramya neerukondaFirst Published Jan 16, 2019, 4:07 PM IST
Highlights

టీం ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీకీ... జనవరి 15వ తేదీకి ఏదో అనుబంధం ఉన్నట్టుంది. ఎందుకంటే.. ఆ రోజున కోహ్లీ ఆట ఆడాడు అంటూ.. సెంచరీలు బాదాల్సిందే. 


టీం ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీకీ... జనవరి 15వ తేదీకి ఏదో అనుబంధం ఉన్నట్టుంది. ఎందుకంటే.. ఆ రోజున కోహ్లీ ఆట ఆడాడు అంటూ.. సెంచరీలు బాదాల్సిందే. గత మూడేళ్లుగా ఇదే రోజున సెంచరీలు బాది.. జట్టు గెలుపుకి కీలకంగా మారాడు. అడిలైడ్ వేదికగా మంగళవారం జరిగిన వన్డే మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ తో రాణించిన సంగతి తెలిసిందే. కాగా.. గడిచిన రెండేళ్లలో కూడా ఇదే రోజున కోహ్లీ సెంచరీలు చేశాడు.

2017 జనవరి 15న భారత్, ఇంగ్లాండ్ మధ్య పుణే వేదికగా వన్డే మ్యాచ్ జరిగింది. ఆమ్యాచ్ లో కోహ్లీ 105 బంతుల్లో 122 పరుగులు చేశాడు. ఆ ఏడాదిలో అదే కోహ్లీ మొదటి సెంచరీ. ఆ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై టీంఇండియా 3వికెట్ల తేడాతో గెలిచింది.

2018జనవరి 13-17 తేదీల్లో సెంచూరియాన్ వేదికగా భారత్- దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ లో భాగంగా రెండో టెస్టు మ్యాచ్ జరిగింది. రెండో టెస్టు మూడో రోజైన జనవరి 15వ తేదీన కోహ్లీ సెంచరీ చేశాడు. 2018లో కోహ్లీ ఫస్ట్ సెంచరీ కూడా ఇదే. తాజాగా 2019లో జనవరి 15వ తేదీన జరిగిన మ్యాచ్ లోనూ కోహ్లీ జనవరి 15వ తేదీనే సెంచరీ చేశాడు. ఇది కూడా ఈ ఏడాదిలో కోహ్లీ ఫస్ట్ సెంచరీ కావడం విశేషం. 

click me!