ఫైనల్స్ కి చేరిన పీవీ సింధు

By ramya neerukondaFirst Published Dec 15, 2018, 3:15 PM IST
Highlights

చైనాలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్స్ టోర్నీలో ప్రముఖ ఇండియన్ బ్మాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ సత్తా చాటింది.


చైనాలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్స్ టోర్నీలో ప్రముఖ ఇండియన్ బ్మాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ సత్తా చాటింది. ఈ మ్యాచ్ లో సింధు.. ఫైనల్స్ చేరింది. నివారం జరిగిన సెమీ ఫైనల్స్‌లో థాయ్‌లాండ్‌ క్రీడాకారిణి రచనోక్‌ ఇంతనోన్‌ను 21-16, 25-23 తేడాతో మట్టి కరిపించింది.

 ఆదివారం జరగనున్న పైనల్స్ లో జపాన్ క్రీడాకారిణి నొజోమి ఒకుహరతో సింధు తలపడనుంది. నిన్న జరిగిన గ్రూప్ చివరి మ్యాచ్‌లో  ప్రపంచ 12వ ర్యాంకర్ బీవెన్ జాంగ్‌‌(అమెరికా)పై సింధు విజయం సాధించి సెమీస్‌కు చేరిన విషయం తెలిసిందే. 

click me!