NEWS
ముకుతాడు బిగించి వ్యాన్లో ఎక్కించి తన యజమానికి అప్పగించారు.
అది పెరులోని కస్కో సిటీ. ఓ ఎద్దు తన యజమాని నుంచి తప్పించుకొని రోడ్డు మీద పడింది. ఇక.. నడి రోడ్డు మీద అది సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. దాని ధాటికి ఎనిమిది మంది గాయపడ్డారు. ఇక.. ఇలా అయితే కుదరదనుకొని.. దాన్ని కట్టడి చేయడానికి అధికారులు ఎంతో ప్రయత్నించారు. చివరికి దానికి ముకుతాడు బిగించి వ్యాన్లో ఎక్కించి తన యజమానికి అప్పగించారు.