పోర్న్ చూడడానికి అలవాటు పడిన ఓ విద్యార్థి ఏకంగా కాలేజీ క్యాంపస్ లోని రెస్ట్ రూంలో అమ్మాయిల వీడియోలు తీస్తూ పట్టుబడ్డాడు.
బెంగళూరు: మరుగుదొడ్లలో చిత్రీకరించిన పోర్న్ వీడియోలను చూడటానికి అలవాటు పడ్డ ఓ 21 ఏళ్ల విద్యార్థి.. ఈ క్రమంలో తనే స్వయంగా రెస్ట్ రూంలలో అమ్మాయిల వీడియోలను తీయడం మొదలుపెట్టాడు. ఈ ఘటన దక్షిణ బెంగళూరులోని హోసకెరెహళ్లిలోని ఓ ప్రైవేట్ కళాశాల క్యాంపస్లో వెలుగు చూసింది. అతను కాలేజీ రెస్ట్ రూంలలో అమ్మాయిలను సెల్ ఫోన్లో చిత్రీకరిస్తూ పట్టుబడ్డాడు.
ఈ మేరకు యాజమాన్యం నుంచి ఫిర్యాదు అందడంతో పోలీసులు నిందితుడు శుభమ్ ను సోమవారం గిరినగర్ పోలీస్ స్టేషన్కు పిలిపించారు. మహిళలు టాయిలెట్లో ఉండగా వీడియో తీసింది నిజమే అని అతను అంగీకరించాడు. "అతని ఫోన్, ల్యాప్టాప్లు పోర్న్ వీడియోలు, ఫొటోలతో నిండి ఉన్నాయి. అయితే, అతడికి వాటితో సంతృప్తి కలగలేదు.. మరిన్ని చూడాలనుకున్నాడు. కానీ అతనికి అలాంటివి మరిన్ని దొరకకపోవడంతో.. తానే స్వయంగా టాయిలెట్లలో మహిళలను చిత్రీకరించాలని నిర్ణయించుకున్నాడు" అని ఒక పోలీసు అధికారి తెలిపారు.
వాళ్లు బాలకార్మికుల కిందికి వస్తారు.. రవీంద్ర జడేజా మాజీ భార్యపై సోదరి ఫైర్..
అయితే, అమ్మాయిలను చిత్రీకరిస్తూ శుభమ్ పట్టుబడడం ఇదే తొలిసారి కాదు. "నవంబర్ 13న కళాశాల యాజమాన్యం అతడిని ఇలా చేస్తూ.. పట్టుకుంది, ఆ సమయంలో తాను ఇకముందు ఇలా చేయనని, ఆ అలవాటు మానుకుంటానని హామీ ఇవ్వడంతో వార్నింగ్ ఇచ్చి వదిలేసింది. అప్పుడే, యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే, తాజా సంఘటన జరగకుండా ఉండేది" అని కొందరు అంటున్నారు.
నవంబరు 19న రెస్ట్ రూంలో వీడియో చిత్రీకరిస్తుంటే ఓ బాలిక అతడిని పట్టుకుంది. ఈ విషయా్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. శుభం తను చిత్రీకరించిన వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
(లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులపై సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు బాధితురాలి గోప్యతను కాపాడేందుకు బాధితురాలి గుర్తింపును వెల్లడించలేదు)