ఎనిమిది నెలలుగా గ్యాంగ్ రేప్.. గర్భం దాల్చిన మైనర్ బాలిక..!

By telugu news teamFirst Published Sep 28, 2021, 7:30 AM IST
Highlights

వారి కారణంగా బాలిక ఇటీవల గర్భం దాల్చి.. బిడ్డకు జన్మనిచ్చింది. అయితే.. దిక్కుతోచని స్థితిలో బిడ్డను బావిలో విసిరేయగా.. ఆ శిశువు చనిపోవడం గమనార్హం. 


ఓ మైనర్ బాలికపై కామాంధులు ఎనిమిది నెలలుగా అత్యాచారానికి పాల్పడుతూనే ఉన్నారు. వారి కామ క్రీడకు బాలిక బలైంది. ఎనిమిది నెలలుగా వారు బాలికపై అఘాయిత్యానికి పాల్పడుతూనే ఉన్నారు. దీంతో.. బాలిక గర్భం దాల్చింది. బాలికపై అఘాయిత్యానికి పాల్పడింది.. ఆమె సమీప బంధువు, వారి స్నేహితులు కావడం గమనార్హం.  కాగా.. వారి కారణంగా బాలిక ఇటీవల గర్భం దాల్చి.. బిడ్డకు జన్మనిచ్చింది. అయితే.. దిక్కుతోచని స్థితిలో బిడ్డను బావిలో విసిరేయగా.. ఆ శిశువు చనిపోవడం గమనార్హం. ఈ దారుణ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మధ్యప్రదేశ్ లోని ఓ గ్రామానికి చెందిన బాలిక కు తల్లి మూడేళ్ల క్రితమే మృతి చెందింది. ఉపాధి నిమిత్తం తండ్రి ఇతర ప్రాంతాలకు వలస వెళుతుంటాడు. కాగా గ్రామంలోని ఇంట్లో ఆ బాలిక ఒంటరిగానే ఉంటోంది. అయితే.. ఆమె వద్దకు సమీప బంధువు(21).. 8 నెలల క్రితం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు,

అతడి మరో నలుగురు స్నేహితులు సైతం బెదిరింపులకు పాల్పడి ఈ దారుణానికి ఒడిగట్టారు. అప్పటి నుంచి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశారు. దీంతో ఆమె తీవ్ర గర్భస్రావమై బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డను బాలిక సహా ప్రధాన నిందితుడు ఓ బావిలో విసిరేశారు. శిశువును హత్య చేసినందుకు బాలిక సహా అత్యాచారానికి పాల్పడ్డ ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ రఘు వంశ్ భదోరియా వెల్లడించారు.  నిందితుల్లో ఇద్దరు మైనర్లు అని తెలిపారు. బాలిక సహా ఇద్దరు మైనర్లు జువైనల్ హోమ్ కు తరలించినట్లు పేర్కొన్నారు.

click me!