ప్రేమలో పడిందని... కూతురిని చంపి నదిలో పడేసిన తల్లిదండ్రులు

By Siva KodatiFirst Published Jul 7, 2019, 10:54 AM IST
Highlights

పశ్చిమ బెంగాల్‌లో దారుణం జరిగింది. కన్నకూతురిని హత్య చేసిన తల్లిదండ్రులు ఆమెను చంపి అనంతరం మృతదేహాన్ని గంగానదిలో పడేశారు. 

పశ్చిమ బెంగాల్‌లో దారుణం జరిగింది. కన్నకూతురిని హత్య చేసిన తల్లిదండ్రులు ఆమెను చంపి అనంతరం మృతదేహాన్ని గంగానదిలో పడేశారు. వివరాల్లోకి వెళితే.. మాల్దా జిల్లా మహేంద్రటోలా గ్రామంలో థీరెన్ మండల్, సుమతి మండల్‌ల 16 ఏళ్ల కుమార్తె,  9వ తరగతి చదువుతోంది.

ఈ క్రమంలో సదరు యువతి తన పక్క గ్రామానికి చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలియడంతో వారు ఆగ్రహంతో రగిలిపోయారు. తమ కుమార్తెను చంపాలని నిర్ణయించుకున్న వారు ఆమెను చంపి అనంతరం మృతదేహాన్ని ఒక బ్యాగులో కుక్కి పక్కనేవున్న గంగానదిలో పడేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు నదిలో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ ఘాతుకానికి పాల్పడిన తల్లిదండ్రులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 

click me!