షాకింగ్ : యువకుడిపై గ్యాంగ్ రేప్.. నిందితుల్లో మైనర్, ఇద్దరికి జీవితఖైదు..

By AN TeluguFirst Published Feb 10, 2021, 10:06 AM IST
Highlights

యూఏఈలో అమానుషం చోటు చేసుకుంది. ఓ యువకుడిని మరో ముగ్గురు యువకులు కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన దారుణ ఘటన జరిగింది. నిందితుల్లో ఒకరు మైనర్ కావడం ఆశ్చర్యం. ఈ కేసులో నిందితుల్లో ఇద్దరికి జీవితఖైదు, మైనర్ కు ఐదేళ్ల జైలుశిక్ష పడింది.

యూఏఈలో అమానుషం చోటు చేసుకుంది. ఓ యువకుడిని మరో ముగ్గురు యువకులు కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన దారుణ ఘటన జరిగింది. నిందితుల్లో ఒకరు మైనర్ కావడం ఆశ్చర్యం. ఈ కేసులో నిందితుల్లో ఇద్దరికి జీవితఖైదు, మైనర్ కు ఐదేళ్ల జైలుశిక్ష పడింది.

వివరాల్లోకి వెడితే.. యూఏఈలోని రస్ అల్ ఖైమాలో ఓ వ్యక్తి తమ గురించి ఇతరులకు తప్పుగా ప్రచారం చేస్తున్నాడన్న కోపంతో ముగ్గురు యువకులు పగ పెంచుకున్నారు. అతడ్ని కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేశారు. 

అందులో ఒకరు బాధితుడిని మాటల్లో పెట్టి ఓ దగ్గరికి రమ్మని పిలిచాడు. అక్కడికి  వచ్చిన బాధితుడిని ఎడారి ప్రాంతానికి తీసుకెళ్లి ఇద్దరు వ్యక్తులు అతని చేతులపై తుపాకీతో కాల్చారు. 

ఆ తరువాత ఇద్దరు వ్యక్తులు అతనిపై అత్యాచారానికి పాల్పడ్డారు. మూడో వ్యక్తి ఈ సంఘటన మొత్తాని వీడియో రికార్డింగ్ చేశాడు. ఆ తరువాత ఈ విషయాన్ని బైటికి చెబితే వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తామంటూ నిందితులు బాధితుడిని బెదిరించారు. 

అయితే వారి బెదిరింపులకు భయపడని బాధితుడు రస్ అల్ ఖైమా పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు వెంటనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి మీద కిడ్నాప్, అత్యాచారం, అవమానం కింద పలు కేసులు నమోదు చేశారు. 

ముగ్గురు నిందితులను రస్ అల్ ఖైమా క్రిమినల్ కోర్టులో హాజరుపరిచారు. జడ్జి ఇద్దరు నిందితులకు జీవితఖైదు విధించారు. మరో నిందితుడు మైనర్ కావడంతో అతడికి ఐదేళ్ల జైలుశిక్షను వేశారు. కింద కోర్టు తీర్పును సవాల్ చేస్తూ నిందితులు పై కోర్టుకు వెళ్లగా.. పైకోర్టు కూడా కింది కోర్టు తీర్పును సమర్థించింది. 

click me!