India-UAE trade deal: ఇటీవల భారత్-యూఏఈ దేశాల వర్చువల్ సమ్మిట్ లో ప్రధాని నరేంద్ర మోడీ, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ పాల్గొన్నారు. ఈ సమ్మిట్ సందర్భంగా భారత్-యూఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ)పై రెండు దేశాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంతో రెండు దేశాలలోని ఆర్థిక వ్యాపారాలు, విద్యా, ఉపాధి, సన్నిహిత ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడానికి సహాయపడుతుందని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ వెల్లడించారు.