ఇవి రాస్తే చాలు...
ఓట్ మీల్ , పాలు: ఓట్స్ , పాలతో చేసిన ఫేస్ ప్యాక్ను ఉపయోగించడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగించి ముఖం మెరుస్తుంది. దీని కోసం, ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల ఓట్ మీల్ పొడిని కొద్దిగా తీసుకోవాలి. ఇప్పుడు అందులో పాలు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మీ ముఖం, మెడ ప్రాంతంలో అప్లై చేసి 5 నిమిషాలు మసాజ్ చేయండి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.
పసుపు , పెరుగు: పసుపు , పెరుగుతో చేసిన ఫేస్ ప్యాక్ ముఖాన్ని ప్రకాశవంతంగా చేయడానికి సహాయపడుతుంది. దీని కోసం, ఒక గిన్నెలో అర టీస్పూన్ పసుపు పొడి , 2 టేబుల్ స్పూన్ల పెరుగు కలిపి, ముఖం , మెడ ప్రాంతంలో అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేయండి. మెరిసే ముఖం పొందడానికి వారానికి ఒకసారి ఈ ఫేస్ ప్యాక్ను ఉపయోగించండి.