పసుపుతో మెరిసే అందం...
ఈ రోజుల్లో పెరుగుతున్న కాలుష్యం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో, చర్మం పొడిగా మారుతుంది. ముఖంలో మెరుపు కూడా తగ్గుతుంది. ఈ సమస్యను పరిష్కరించడంలో ఇంట్లో తయారు చేసిన పసుపు ఫేషియల్ స్క్రైబ్ వాడితే చాలు.. ముఖం ప్రకాశవంతంగా మెరుస్తుంది. అయితే, వారానికి కనీసం మూడు సార్లు అయినా ఈ పసుపు ప్యాక్ ని ముఖానికి వాడాల్సిందే. ఈ పసుపులో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ ప్లమేటరీ ప్రాపర్టీలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ముఖంపై మురికిని తొలగించడంతో పాటు... ఫేస్ ని తాజాగా ఉంచుతాయి.
పసుపు ఫేస్ స్క్రబ్ తయారీకి కావాల్సిన పదార్థాలు...
కస్తూరి పసుపు- 3 టేబుల్ స్పూన్లు, శెనగ పిండి-5 టేబుల్ స్పూన్లు, బియ్యం పిండి కొద్దిగా, కొబ్బరి నూనె 3 టేబుల్ స్పూన్లు, పెరుగు కొద్దిగా.. ఇవి ఉంటే చాలు. వీటితో అందాన్ని పెంచుకోవచ్చు.