శనగ పిండిలో ఇవి కలిపి రాస్తే..
శనగపిండి–పెరుగు
శనగపిండి, పెరుగు ఫేస్ ప్యాక్ చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా ఉంచుతుంది. 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 3 టేబుల్ స్పూన్ల పెరుగు, చిటికెడు పసుపు కలిపి ముఖానికి రాయాలి. మంచిగా ముఖాన్ని మసాజ్ చేయాలి. 20 నిమిషాల తర్వాత నీటితో ముఖాన్ని కడుక్కుంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల చర్మానికి తేమ, మృదుత్వం వస్తుంది. అదే విధంగా, శనగపిండి–తేనె ప్యాక్లో తేనె సహజమైన మాయిశ్చరైజర్గా పనిచేసి మచ్చలను తగ్గిస్తుంది. 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1 టేబుల్ స్పూన్ తేనె, చిటికెడు పాలు కలిపి రాసి 20 నిమిషాల తర్వాత కడగాలి.
మరొక మంచి ఆప్షన్ శనగపిండి–కాఫీ–పెరుగు ప్యాక్... 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, 2 టేబుల్ స్పూన్ల పెరుగు కలిపి రాసి 20 నిమిషాల తర్వాత కడిగితే రక్తప్రసరణ మెరుగుపడి చర్మం ఫ్రెష్గా కనిపిస్తుంది. టమోటా జ్యూస్ లో శనగపిండి,పెరుగు కలిపి ముఖానికి రాస్తే.. నల్లటి మచ్చలను తగ్గించి చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టీస్పూన్ టమోటా రసం, 1 టీస్పూన్ పెరుగు కలిపి 15 నిమిషాల తర్వాత కడగాలి. రెగ్యులర్ గా చేయడం వల్ల ముఖంలో మార్పులు సహజంగా చూస్తారు.