పెరుగు, తేనె ఫేస్ ప్యాక్..
పెరుగులో తేనె కలిపి ముఖానికి రాస్తే మీ చర్మం మృదువుగా మారుతుంది. డ్రై స్కిన్ సమస్య అనేదే ఉండదు. మాయిశ్చరైజింగ్ గా ఉంటుంది. ముఖానికి ఈ మిశ్రం రాసి 15 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే చాలు.. మీ ముఖంలో వచ్చే మార్పు మీకే స్పష్టంగా కనపడుతుంది.
పెరుగు, పసుపు ఫేస్ ప్యాక్..
పెరుగు, పసుపు ఫేస్ ప్యాక్ కూడా మీ స్కిన్ గ్లో పెంచడానికి కూడా సహాయపడుతుంది. ఎండ కారణంగా ముఖంపై ట్యాన్ ఏర్పడితే ఈ ఫేస్ ప్యాక్ తో ఆ ట్యాన్ మొత్తం పోతుంది. ఈ రెండింటిని బాగా కలిపి ముఖానికి, మెడకు బాగా పట్టించాలి. 20 నిమిషాలు అలాగే వదిలేసి, గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.