Skin Care: ఎండాకాలంలో ఏం రాస్తే మీ ముఖం మెరుస్తుందో తెలుసా?

Published : Apr 14, 2025, 11:58 AM ISTUpdated : Apr 14, 2025, 12:02 PM IST

కలబందని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ.. ఇది మన చర్మాన్ని స్మూత్ గా, మెరిసేలా మార్చడంలో సహాయపడుతుంది. కలబంద గుజ్జులో ఉండే లక్షణాలు మన చర్మాన్ని చల్లబరచడానికి, హైడ్రేటెడ్ గా మార్చడానికి సహాయపడుతుంది.

PREV
14
Skin Care: ఎండాకాలంలో ఏం రాస్తే మీ ముఖం మెరుస్తుందో తెలుసా?

ఎండాకాలం వచ్చింది అంటే చాలు చర్మ సంబంధిత సమస్యలు చాలానే వస్తాయి. ఇంట్లో బయటకు వెళితే చాలు.. ముఖం కళ తప్పుతుంది. ట్యాన్ పేరుకుపోవం, ఎండ దెబ్బకు చర్మం కమిలిపోవడం లాంటివి జరుగుతుంటాయి. మరి, ఈ సమ్మర్ లో స్కిన్ డ్యామేజ్ అవ్వగుండా.. ముఖం మెరుస్తూ కనపించాలా? మరి, ఏం రాస్తే.. అందంగా కనపడతారో తెలుసుకుందాం..

24

సమ్మర్ లో మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్లకపోయినా ఒక్కోసారి స్కిన్ టానింగ్ అయిపోతుంది.మొటిమలు వచ్చేస్తాయి.. బ్లాక్ హెడ్స్ కూడా ముఖ అందాన్ని పోగొడతాయి. చర్మం గ్లో కూడా తగ్గిపోతుంది. అందుకే వారు తమ చర్మ కాంతిని కాపాడుకోవడానికి ఇంట్లో ఈజీగా లభించే వాటినిరాస్తే చాలు. వాటిలో కలబంద ముందు వరసలో ఉంటుంది. కలబందని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ.. ఇది మన చర్మాన్ని స్మూత్ గా, మెరిసేలా మార్చడంలో సహాయపడుతుంది. కలబంద గుజ్జులో ఉండే లక్షణాలు మన చర్మాన్ని చల్లబరచడానికి, హైడ్రేటెడ్ గా మార్చడానికి సహాయపడుతుంది.
 

ముఖానికి కలబంద జెల్ ఎలా అప్లై చేయాలి?

తాజా కలబంద జెల్‌ను తీసుకొని మీ ముఖంపై మసాజ్ చేసినట్లుగా అప్లై చేయండి. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు దీనిని రాయడం ఉత్తమం. మంచిగా మసాజ్ చేసిన తర్వాత ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత ముఖాన్ని కడుక్కుంటే సరిపోతుంది

34

రోజ్ వాటర్, గ్లిజరిన్...
చర్మ సంరక్షణకు రోజ్ వాటర్ ఉపయోగించవచ్చు. రోజ్ వాటర్ అనేక లక్షణాలను కలిగి ఉంది, చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రోజ్ వాటర్‌ను గ్లిజరిన్‌తో కలిపి ఉపయోగించవచ్చు. రోజ్ వాటర్ లో గ్లిజరిన్ కలిపి మిశ్రమాన్ని రాయాలి.  ఈ మిశ్రమంలో కాటన్ బాల్స్ వేసి ఉంచాలి. ఆ తర్వాత రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకొని, ఈ  కాటన్ బాల్స్ తో ముఖానికి రాయాలి. రాత్రంతా అలా వదిలేసి.. ఉదయాన్నే శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండు, మూడుసార్లు ఇలా రాసినా చాలు. మీ ముఖం రెట్టింపు అందంతో మెరుస్తూ కనపడుతుంది.

44
skin care

విటమిన్ ఇ క్యాప్సూల్స్
వేసవిలో మీ చర్మాన్ని డ్యామేజ్ నుంచి కాపాడటానికి.. మీరు విటమిన్ ఇ క్యాప్సూల్స్‌ను ఉపయోగించవచ్చు. విటమిన్ ఇ క్యాప్సూల్స్‌ను ఉపయోగించడం వల్ల మచ్చలు తగ్గుతాయి. మీ ముఖం మెరుస్తుంది. మీరు బాదం నూనెతో విటమిన్ ఇ క్యాప్సూల్స్‌ను ఉపయోగించవచ్చు.

విటమిన్ ఇ క్యాప్సూల్స్‌ను ఎలా ఉపయోగించాలి

విటమిన్ ఇ క్యాప్సూల్ నుండి నూనెను తీయండి.ఆ తర్వాత దానికి బాదం నూనె జోడించండి.పడుకునే ముందు మీ ముఖానికి అప్లై చేయండి.
ఈ రెమెడీని ప్రతిరోజూ చేయండి.ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల కూడా మీ ముఖం మెరుస్తూ..వయసు తగ్గినట్లుగా కనపడతారు.


 

Read more Photos on
click me!

Recommended Stories