IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు... ఈ జిల్లాలకు ఏకంగా ఎల్లో అలర్ట్

Published : Mar 13, 2026, 07:52 AM ISTUpdated : Mar 13, 2026, 07:54 AM IST

Weather Update : ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు మొదలయ్యాయి… ఇకపై తెలంగాణలో కూడా వానలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఏఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే…

PREV
15
తెెలుగు రాష్ట్రాలకు కూల్ న్యూస్..

IMD Rain Alert : బంగాళాఖాతంలో మరోసారి వర్షాలకు అనుకూల వాతావరణం ఏర్పడింది. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిన వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు మొదలవగా తెలంగాణలో మరో రెండ్రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. మొత్తంగా రాబోయే రోజుల్లో ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గి చల్లని వాతావరణం ఉంటుందన్నమాట. 

25
ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ద్రోణి ఏర్పడినట్లు వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో ఇవాళ (మార్చి 13, శుక్రవారం) ఆకాశం మేఘావృతమై ఉంటుందని... వర్షాలు పడే అవకాశం ఉంటుందని తెలిపింది. కోస్తాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. విశాఖపట్నం, కాకినాడ, నెల్లూరు వంటి తీరప్రాంత జిల్లాలపై ద్రోణి ప్రభావం ఎక్కువగా ఉంటుందని... ఉరుములు మెరుపులు, పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

35
ఈ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు

ఇక మరో తెలుగురాష్ట్రం తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈరోజు, రేపు (శుక్ర, శనివారం) ఎండల తీవ్రత కాస్త తక్కువగా ఉంటుందని... ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలకంటే తక్కువగా నమోదవుతాయని తెలిపింది. ఇక ఆదివారం(మార్చి 15న) ఆకాశం మేఘావృతమై ఉండి పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇలా ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు,భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు.

45
హైదరాబాద్ లో వానలు

వచ్చే సోమవారం (మార్చి 16న) కూడా వర్షాలు కొనసాగుతాయని... మరిన్ని జిల్లాలకు ఇవి విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అలాగే మహబూబాబాద్, వరంగల్, హన్మకొంండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలకు వానలు వ్యాపిస్తాయని హైదరాబాద్ వాతవారణ కేంద్రం ప్రకటించింది. ఇలా ఆది, సోమవారం వర్షాలు కురిసే అవకాశమున్న జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

55
వేసవి వర్షాలు ఇంత ప్రమాదకమా..!

సాధారణంగా వేసవిలో కురిసే కాస్త ప్రమాదకరంగా ఉంటాయి. వర్షపాతం తక్కువే అయినా ఉరుములు మెరుపులు, పిడుగులు, ఈదురుగాలుల బీభత్సం ఎక్కువగా ఉంటుంది. వడగళ్ల వానలు కూడా పడుతుంటాయి. కాబట్టి ఈ వర్షాల కారణంగా కొన్నిసార్లు పంట, ఆస్తి నష్టమై కాదు ప్రాణనష్టం కూడా జరిగే అవకాశాలుంటాయి. కాబట్టి ప్రజలు మరీముఖ్యంగా రైతులు, కూలీలు వర్షాల సమయంలో జాగ్రత్తగా ఉండాలని... చెట్లకింద అస్సలు ఉండకూడదని సూచిస్తుంటారు..

Read more Photos on
click me!

Recommended Stories