Half Day Schools: విద్యార్థుల‌కు పండ‌గే..హాఫ్ డే స్కూల్స్ ఎప్ప‌టి నుంచంటే. అధికారిక ప్ర‌క‌ట‌న

Published : Mar 12, 2026, 05:45 PM IST

Half Day Schools: తెలంగాణ‌లో ఎండ‌లు దంచికొడుతున్న త‌రుణంలో రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో పాఠశాలల పనివేళలను మార్చుతూ ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి. 

PREV
15
ఎండల ప్రభావంతో ప్రభుత్వ నిర్ణయం

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఒంటిపూట బ‌డుల‌ను ప్రారంభిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. వేసవి ప్రభావం ఎక్కువగా ఉండే మధ్యాహ్న సమయంలో పాఠశాలలు కొనసాగడం వల్ల పిల్లలపై ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు భావించారు. అందుకే పాఠశాల సమయాలను తగ్గించి ఉదయం సమయంలోనే తరగతులు పూర్తిచేయాలని నిర్ణయించారు.

25
ఒంటిపూట బ‌డులు ఎప్ప‌టి నుంచంటే.?

రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఈ నెల 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు అమల్లోకి రానున్నాయి. ఈ విధానం ఏప్రిల్ 23 వరకు కొనసాగుతుంది. ఈ కాలంలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు అన్నీ ఒకే విధంగా ఈ కొత్త టైమింగ్స్‌ను పాటించాల్సి ఉంటుంది.

35
పాఠశాలల కొత్త టైమింగ్స్

కొత్త షెడ్యూల్ ప్రకారం ఉదయం 8 గంటలకు పాఠశాలలు ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 12.30 గంటల వరకు మాత్రమే తరగతులు నిర్వహిస్తారు. ప్రాథమిక పాఠశాలలు, అప్పర్ ప్రైమరీ స్కూళ్లు, హైస్కూల్స్ అన్నీ ఈ సమయాలను అనుసరిస్తాయి. తరగతులు ముగిసిన తర్వాత విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేస్తారు.

45
పదో తరగతి పరీక్షల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో కొన్ని పాఠశాలల్లో ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి. పరీక్షా కేంద్రాలుగా ఉన్న పాఠశాలలు పరీక్షలు జరిగే రోజుల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తాయి. మిగతా రోజుల్లో మాత్రం సాధారణ ఒంటిపూట టైమింగ్స్ కొనసాగుతాయి.

55
విద్యాశాఖ జారీ చేసిన ఆదేశాలు

ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఇ. న‌వీన్ నికోల‌స్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యాధికారులు ఈ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ మార్పులు తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories