Weather Report: ఊపిరి పీల్చుకోండి.. వ‌చ్చే 4 రోజులు వ‌ర్షాలు. ఈ ప్రాంతంలో మాత్రం ఉరుములు, మెరుపులు

Published : Apr 05, 2026, 07:50 AM IST

Weather Report: రోజురోజుకీ పెరుగుతోన్న ఎండ‌ల‌తో ఇబ్బంది ప‌డుతోన్న ప్ర‌జ‌ల‌కు వాతావ‌ర‌ణ శాఖ ఒక కూల్ న్యూస్ చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల ప్రభావంతో తెలంగాణలో పలు ప్రాంతాల్లో రాబోయే ఐదు రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. 

PREV
15
ఎండల తర్వాత వర్షాల సూచన

రాష్ట్రంలో ప్రస్తుతం నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు బయటకు వెళ్లడం కూడా కష్టంగా మారింది. మధ్యాహ్నం సమయంలో వేడి తీవ్రత ఎక్కువగా ఉండటంతో రోజువారీ పనులు కూడా ప్రభావితమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ ప్రకటించిన వర్ష సూచన ప్రజలకు కొంత ఉపశమనం కలిగించనుంది. ఏప్రిల్ 5 నుంచి 8 వరకు తెలంగాణలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

25
పలు జిల్లాలకు వర్ష హెచ్చరిక

ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి వంటి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులు కూడా వీచే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

35
ఈదురు గాలులు.. ఉష్ణోగ్రతల్లో తగ్గుదల

వర్షం కురిసే సమయంలో గంటకు సుమారు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వర్షాల ప్రభావంతో ప్రస్తుతం నమోదవుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గే అవకాశముంది. దీని వల్ల రాష్ట్రంలో మండే ఎండల నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభించవచ్చని అధికారులు చెబుతున్నారు.

45
రైతులకు సూచనలు

అకాల వర్షాల వల్ల వ్యవసాయ పనులపై ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా కోత దశలో ఉన్న పంటలు, ఆరబెట్టిన ధాన్యం నష్టపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల రైతులు తమ పంటలను రక్షించుకునేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వడగళ్ల వాన పడే అవకాశమున్న ప్రాంతాల్లో రైతులు మరింత అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

55
ఏప్రిల్ 9 నుంచి పొడి వాతావరణం

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఏప్రిల్ 9 నుంచి తెలంగాణలో మళ్లీ పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. ఆ తర్వాత వర్ష సూచనలు తగ్గే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదే సమయంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా వచ్చే మూడు రోజుల పాటు అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అలాగే కొన్ని మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

Read more Photos on
click me!

Recommended Stories