ఆదివారం తెలంగాణలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రంగా ఉంటుందని అయితే మధ్యాహ్నం 1 గంట తర్వాత మేఘాలు ఏర్పడతాయని అధికారులు అంచనా వేశారు. సాయంత్రం 4 తర్వాత హైదరాబాద్లో వర్షం మొదలవుతుందని తెలిపారు. నిజామాబాద్, తాండూరు, మెదక్, మేడ్చల్, జగిత్యాల తదితర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు.