హైదరాబాద్ నగర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. రానున్న రోజుల్లో నగరంలో ఎలక్ట్రిక్ బస్సులు పెద్ద ఎత్తున పరుగులు పెట్టనున్నాయి. ఇందుకు సంబంధించి తాజాగా అధికారిక ప్రకటన చేశారు.
15
పీఎం ఈ డ్రైవ్
పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద 2,000 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించింది. ఈ నిర్ణయం కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్రాల సమీక్షా సమావేశంలో తీసుకున్నారు.
25
తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు భారీగా ఈవీ బస్సులు
ఈ పథకం కింద కేవలం హైదరాబాద్కే కాకుండా బెంగళూరుకు 4,500, ఢిల్లీకి 2,800, అహ్మదాబాద్కు 1,000, సూరత్కు 600 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించారు. సుస్థిర రవాణా వ్యవస్థ ఏర్పాటు కోసం కేంద్రం రాష్ట్రాల సమన్వయంతో ఈవీ వాహనాల విస్తరణకు ఈ నిర్ణయం పనిచేస్తోంది.
35
“సుస్థిర రవాణా మా నిబద్ధత”: హెచ్డీ కుమారస్వామి
ఈ సందర్భంగా మంత్రి కుమారస్వామి మాట్లాడుతూ, ప్రధాని మోదీ నేతృత్వంలో నగర రవాణాను పర్యావరణపరంగా శుద్ధంగా, ప్రయాణికులకు సౌకర్యవంతంగా మార్చేందుకు ఇది కీలక అడుగు అని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణతో భారత రవాణా రంగంలో సమూల మార్పు తీసుకొస్తుందని తెలిపారు.
పీఎం ఈ-డ్రైవ్ పథకం ద్వారా 2024 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు రూ.10,900 కోట్ల వ్యయంతో 14,028 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తేవాలన్నది కేంద్ర లక్ష్యం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఈవీ బస్సుల ప్రోగ్రాంలలో ఒకటిగా నిలవనుంది.
55
ఈ-వోచర్లు, ఈ-ఆంబులెన్సులు, ఈ-ట్రక్కులు కూడా
బస్సుల సరఫరాతో పాటు కొనుగోలుదారులకు డిమాండ్ ఇన్సెంటివ్ అందించేందుకు ఈ-వోచర్లు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అలాగే త్వరలో ఈ-ఆంబులెన్సులు, ఈ-ట్రక్కులు కూడా మార్కెట్లోకి రానున్నట్లు తెలిపారు. ఈ ప్రత్యేక వాహనాల కోసం కేంద్రం రూ.500 కోట్లు కేటాయించింది.