హైదరాబాద్తో పాటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రాజన్న సిరిసిల్ల, నాగర్ కర్నూల్, సిద్దిపేట, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి, ములుగు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లోని ప్రజలు అత్యవసరమైతేకానీ బయటకు రాకూడదని అధికారులు సూచించారు.