గోలీమార్‌.. హైద‌రాబాద్‌లో పోలీసుల కాల్పులు. అస‌లేం జ‌రిగిందంటే.?

Published : Oct 26, 2025, 10:15 AM IST

Hyderabad: నిజామాబాద్‌లో బైక్ దొంగ రియాజ్ చేతిలో ప్ర‌మోద్ అనే కానిస్టేబుల్ హ‌త్య‌కు గురికావ‌డం ఆ త‌ర్వాత రియాజ్ మ‌ర‌ణించ‌డం తెలిసిందే. తాజాగా హైద‌రాబాద్‌లో మ‌రోసారి కాల్పులు క‌ల‌క‌లం రేపాయి. 

PREV
15
చాదర్‌ఘాట్‌లో పోలీసు కాల్పులు

హైదరాబాద్‌ చాదర్‌ఘాట్‌లోని విక్టోరియా గ్రౌండ్ దగ్గర శనివారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. మొబైల్‌ స్నాచింగ్‌ చేస్తున్న ఇద్దరు దొంగలను పట్టుకునేందుకు సౌత్‌ ఈస్ట్‌ డీసీపీ చైతన్య అక్కడికి వెళ్లారు. ఈ సమయంలో ఒక దొంగ కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించాడు. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో డీసీపీ ఆత్మరక్షణలో కాల్పులు జరిపిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.

25
కాల్పుల్లో ఎవరు గాయపడ్డారు?

డీసీపీ చైతన్య మూడు రౌండ్లు కాల్పులు జరిపార‌ని తెలుస్తోంది. ఈ దాడిలో ఒక దొంగకు ఛాతీ, భుజం, మెడ భాగాల్లో గాయాలు అయ్యాయి. గాయపడిన అతడిని వెంటనే నాంపల్లి ఆసుపత్రికి తరలించారు. మరో దొంగ పారిపోయాడు. డీసీపీతో ఉన్న గన్‌మన్ కూడా తోపులాటలో స్వల్పంగా గాయపడ్డాడు.

35
గాయపడిన దొంగ ఎవరు?

పోలీసులు గాయపడిన దొంగను మహ్మద్‌ ఒమర్‌ అన్సారీగా గుర్తించారు. అతడు పాతబస్తీకి చెందిన రౌడీషీటర్‌. మొబైల్‌ దొంగతనాలు, దాడులు వంటి పలు కేసులు అతనిపై ఉన్నాయి. రెండు సంవత్సరాలు జైలులో ఉండి, ఇటీవలే బయటకు వచ్చి మళ్లీ నేరాలకు పాల్పడుతున్నాడు. ఒమ‌ర్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

45
సీపీ సజ్జనార్ స్పందన

ఈ ఘటనపై హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్ స్పందించారు. పోలీసులు ఎవరిపైనా అనవసరంగా కాల్పులు జరపరని, కానీ ఆత్మరక్షణ కోసం తప్పనిసరిగా చర్యలు తీసుకుంటారని చెప్పారు. "పోలీసులపై దాడి చేస్తే ఎవరినీ విడిచిపెట్టం. ప్రజల భద్రత కోసం పోలీసులే కష్టపడుతున్నారు," అని ఆయన హెచ్చరించారు.

55
కొన‌సాగుతోన్న ద‌ర్యాప్తు

డీసీపీ చైతన్య ఫిర్యాదుతో సుల్తాన్‌బజార్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఘటన స్థలాన్ని క్లూస్‌ టీమ్‌ పరిశీలించి ఆధారాలు సేకరిస్తోంది. పరారీలో ఉన్న మరో దొంగ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. గాయపడిన డీసీపీ, గన్‌మన్‌ ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories