ఇంట‌ర్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల‌.. 12 ఏళ్ల త‌ర్వాత సిల‌బ‌స్ మార్పు, ప‌రీక్ష విధానంలోనూ మార్పు

Published : Oct 25, 2025, 02:24 PM IST

Inter Exams: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు 2025 సంవత్సరానికి సంబంధించిన పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈసారి పాఠ్యాంశాలతో పాటు, పరీక్షా విధానంలోనూ పలు మార్పులు చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
పరీక్షల తేదీలు ఖరారు

ఇంటర్మీడియట్ పరీక్షలు వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరగనున్నాయి. 

ఫస్ట్ ఇయర్ పరీక్షలు: ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభ‌మ‌వుతాయి.

సెకండ్ ఇయర్ పరీక్షలు: ఫిబ్రవరి 26 నుంచి మొద‌లు కానున్నాయి.

ప్రాక్టికల్ పరీక్షలు: జనవరి చివరి వారంలో ప్రారంభమై, ఫిబ్రవరి మొదటి వారంలో ముగుస్తాయి.

ఈ షెడ్యూల్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. అలాగే, నవంబర్ 1 నుంచే విద్యార్థులు పరీక్షల ఫీజులను ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు.

25
ఫస్ట్ ఇయర్ నుంచే ల్యాబ్, ప్రాక్టికల్ పరీక్షలు

ఇప్పటివరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కేవలం సెకండ్ ఇయర్ విద్యార్థులకే ఉండేవి. కానీ ఈసారి ఫస్ట్ ఇయర్ నుంచే ల్యాబ్, ప్రాక్టికల్ పరీక్షలను ప్రవేశపెడుతున్నారు. ప్రాక్టికల్స్‌లో ఇంగ్లీష్‌తో పాటు ఇతర భాషల్లోనూ పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థుల్లో ప్రాక్టికల్ నైపుణ్యాలు పెంచ‌డ‌మే దీని ప్ర‌ధాన ఉద్దేశం. కొత్త విధానం ప్రకారం, 80 మార్కులు ఎక్స్‌టర్నల్, 20 మార్కులు ఇంటర్నల్ పరీక్షలకు కేటాయిస్తారు. బోర్డు అధికారులు చెబుతున్నట్లుగా, “విద్యార్థులు సిద్ధాంతపరంగా నేర్చుకోవడం కాకుండా ప్రయోగాత్మకంగా అర్థం చేసుకోవడం కోసం ఈ మార్పులు ఎంతో అవసరం” అన్నారు.

35
12 ఏళ్ల తర్వాత

ఇంటర్ సిలబస్‌లో సుమారు 12 ఏళ్ల తర్వాత పెద్ద మార్పులు జరుగుతున్నాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ వంటి సబ్జెక్టుల్లో కొత్త పాఠ్యాంశాలు ప్రవేశపెడుతున్నారు. NCERT మార్గదర్శకాలు, సబ్జెక్టు కమిటీ సూచనలు ఆధారంగా ఈ మార్పులు చేస్తున్నారు. జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ లెక్చరర్లు ఈ సిలబస్ రూపకల్పనలో భాగస్వాములు కానున్నారు. డిసెంబరు 15 నాటికి సిలబస్‌ను తెలుగు అకాడమీకి అందించి, ఏప్రిల్ చివరినాటికి కొత్త పాఠ్యపుస్తకాలను విడుదల చేయనున్నారు. కొత్త పుస్తకాలలో QR కోడ్ ఫీచర్ ఉంటుంది. దీని ద్వారా విద్యార్థులు వీడియో లెక్చర్లు, అదనపు కంటెంట్‌ను ఆన్‌లైన్‌లో సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు.

45
కొత్త గ్రూప్

అకౌంటెన్సీ సబ్జెక్టుకు పెరుగుతున్న ఆద‌ర‌ణ నేప‌థ్యంలో ప్రత్యేకంగా ACE గ్రూప్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. 2026 నుంచి ఈ కోర్సును ప్రారంభించ‌నున్న‌ట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఇందులో అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్ సబ్జెక్టులు ఉంటాయి. హ్యూమానిటీస్‌ సబ్జెక్టుల్లో యాక్టివిటీ బేస్డ్ సిలబస్ ప్రవేశపెడుతున్నారు. విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలు, డిజిటల్ అవగాహన పెంపొందించేలా పాఠ్యాంశాలను రూపొందిస్తున్నారు.

55
పారదర్శకతతో ప్రాక్టికల్స్

ప్రాక్టికల్ పరీక్షలను ఈసారి ప్రభుత్వ కాలేజీల్లోనే నిర్వహించనున్నారు. దీని ఉద్దేశం పారదర్శకతను పెంచడం, విద్యార్థుల్లో పరీక్షల పట్ల ఉన్న భయాన్ని తగ్గించడం. ప్రతి సంవత్సరం సుమారు 4.2 లక్షల మంది విద్యార్థులు ప్రాక్టికల్స్ రాస్తుంటారు. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో హాజరు కానున్నారు. ఇక మొత్తం ఇంటర్ పరీక్షలకు ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 9.5 లక్షల విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories