Hyderabad: ఇల్లు కొనే బ‌దులు కిరాయికి ఉంది ఉత్త‌మం.. 18 శాతం జీఎస్టీతో కొత్త త‌ల‌నొప్పి

Published : May 10, 2026, 10:22 AM IST

Hyderabad: గేటెడ్ క‌మ్యూనిటీల్లో ఇల్లు చాలా మందికి డ్రీమ్ లాంటిది. కానీ ఇప్పుడు అది భారంగా మార‌బోతోంది. గేటెడ్ కమ్యూనిటీలను ఎన్నుకుంటున్న కుటుంబాలకు ఇప్పుడు మెయింటెనెన్స్ ఛార్జీలపై విధిస్తున్న 18 శాతం జీఎస్టీ కొత్త తలనొప్పిగా మారింది.

PREV
15
నెలసరి మెయింటెనెన్స్ భారీ ఖర్చు

హైదరాబాద్‌లోని చాలా గేటెడ్ కమ్యూనిటీల్లో ప్రతి చదరపు అడుగుకు రూ.3 నుంచి రూ.5 వరకు మెయింటెనెన్స్ వసూలు చేస్తున్నారు. పెద్ద అపార్ట్‌మెంట్లు, విల్లా ప్రాజెక్టుల్లో ఇది ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు 2,500 చదరపు అడుగుల ఫ్లాట్‌కు నెలకు సుమారు రూ.7,500 వరకు నిర్వహణ ఖర్చు వస్తోంది. ఈ మొత్తంలో సెక్యూరిటీ సిబ్బంది జీతాలు, హౌస్‌కీపింగ్, లిఫ్ట్ నిర్వహణ, పవర్ బ్యాకప్, గార్డెనింగ్, వాటర్ మేనేజ్‌మెంట్, క్లబ్ హౌస్ నిర్వహణ వంటి ఖర్చులు ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ మొత్తం రూ.7,500 దాటితే మొత్తం బిల్లుపై 18 శాతం జీఎస్టీ వర్తించడం నివాసితులను ఆందోళనకు గురిచేస్తోంది.

25
ఒక్క రూపాయి పెరిగినా భారీ పన్ను

ఈ జీఎస్టీ విధానం పట్ల ఎక్కువ విమర్శలు వస్తున్న కారణం ‘థ్రెషోల్డ్ లిమిట్’ విధానం. ఒకవేళ మీ మెయింటెనెన్స్ బిల్లు రూ.7,499 ఉంటే జీఎస్టీ ఉండదు. కానీ అది రూ.7,501 అయితే మొత్తం మొత్తంపైనే 18 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుంది. అంటే నెలకు సుమారు రూ.1,350 వరకు అదనంగా చెల్లించాల్సి రావచ్చు. సంవత్సరానికి ఇది రూ.16 వేలకుపైగా అవుతుంది. ఇప్పటికే EMIలు, పిల్లల ఫీజులు, కరెంట్ బిల్లులు, పెరిగిన నిత్యావసర ధరలతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఇది మరో ఆర్థిక భారం అవుతోంది.

35
పేరుకే సొంతిల్లు కానీ..

గేటెడ్ కమ్యూనిటీల్లో నివసించే వారు ఇప్పుడు ఒకే ప్రశ్న అడుగుతున్నారు — “సొంత ఇల్లు కొనుగోలు చేసి, మేమే నిర్వహణ ఖర్చులు భరిస్తుంటే మళ్లీ జీఎస్టీ ఎందుకు?” ఇప్పటికే ప్రజలు ఇన్‌కమ్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్ వంటి పలు పన్నులు చెల్లిస్తున్నారు. అయినా తమ నివాస సముదాయాన్ని శుభ్రంగా, భద్రంగా ఉంచుకునేందుకు అసోసియేషన్లు వసూలు చేసే డబ్బుపై కూడా పన్ను విధించడం సరైనది కాదని వారు అంటున్నారు.

ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీల్లో ఉండేవారంతా ధనవంతులే అన్న భావన సరైంది కాదని, ఉద్యోగులు, ఐటీ సిబ్బంది, రిటైర్డ్ ఉద్యోగులు, మధ్యతరగతి కుటుంబాలు కూడా ఇప్పుడు ఇలాంటి సముదాయాల్లో ఉంటున్నాయని చెబుతున్నారు.

45
అసోసియేషన్ల ఆందోళనలు పెరుగుతున్నాయి

హైదరాబాద్, సైబరాబాద్, తెల్లాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లోని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు (RWAలు) ఈ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. లాభాపేక్ష లేకుండా కేవలం నిర్వహణ కోసం మాత్రమే ఈ మొత్తాలు వసూలు చేస్తున్నామని, వాటిని వ్యాపార కార్యకలాపాలుగా చూడకూడదని అంటున్నాయి. “మా కొద్దీ జీఎస్టీ” అనే నినాదంతో కొన్ని అసోసియేషన్లు సంతకాల సేకరణ కార్యక్రమాలు కూడా ప్రారంభించాయి. కేంద్ర జీఎస్టీ అధికారులకు ప్రాతినిధ్య పత్రాలు పంపిస్తూ, తమను నాన్-ప్రాఫిట్ సంస్థలుగా గుర్తించాలని కోరుతున్నాయి.

55
ఇతర నగరాలకు కూడా వ్యాపిస్తున్న నిరసనలు

హైదరాబాద్‌కే పరిమితం కాకుండా ఈ అంశం ఇప్పుడు ముంబై, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాలకు కూడా విస్తరిస్తోంది. భారీ హౌసింగ్ సొసైటీలు ఉన్న నగరాల్లో లక్షలాది కుటుంబాలు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాయి. పట్టణ జీవన వ్యయం రోజురోజుకీ పెరుగుతున్న సమయంలో మెయింటెనెన్స్‌పై అదనపు జీఎస్టీ విధించడం వల్ల గేటెడ్ కమ్యూనిటీల్లో జీవనం మరింత ఖరీదుగా మారుతోందని నివాసితులు చెబుతున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు ఇది నెలసరి బడ్జెట్‌పై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories