హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. దేశంలో తొలిసారి ఎయిర్ పోర్ట్ కింది నుంచి అండ‌ర్‌పాస్‌. ట్రాఫిక్ న‌ర‌కం నుంచి విముక్తి

Published : Mar 25, 2026, 07:21 AM IST

Hyderabad: హైద‌రాబాద్ ఇప్ప‌టికీ కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ స‌మ‌స్య‌లు ఉంటూనే ఉన్నాయి. అలాంటి మార్గాల్లో సికింద్రాబాద్ ప్యార‌డైజ్ నుంచి సుచిత్ర రూట్ ఒక‌టి. అయితే ఈ స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారంగా కీల‌క అడుగు ప‌డింది. 

PREV
15
రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారం కనుగొనే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు బేగంపేట ఎయిర్‌పోర్ట్ రన్‌వే కింద మల్టీ లేన్ అండర్‌పాస్ నిర్మించేందుకు కేంద్ర సంస్థ అయిన ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) అనుమతులు ఇచ్చింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శాసనమండలిలో వెల్లడించారు. ఇది పూర్తయితే నగర ఉత్తర దిశ నుంచి వచ్చే వాహనదారులకు ప్రయాణం చాలా సులభం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో కంటోన్మెంట్ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

25
బేగంపేట రన్‌వే కింద అండర్‌పాస్..

సుచిత్ర జంక్షన్ నుంచి ప్యారడైజ్ సర్కిల్ వరకు ప్రతిపాదించిన ఎలివేటెడ్ కారిడార్‌లో భాగంగా బేగంపేట విమానాశ్రయ రన్‌వే కింద అండర్‌పాస్ నిర్మించనున్నారు. వాహనాల రాకపోకలు అంతరాయం లేకుండా సాగేందుకు ఈ అండర్‌పాస్‌ను మల్టీ లేన్ విధానంలో నిర్మించాలనే ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రాజెక్టు అమలులోకి వస్తే ఆదిలాబాద్, నిజామాబాద్, మెద‌క్‌ వంటి ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి హైదరాబాద్‌లోకి వచ్చే వాహనదారులు కంటోన్మెంట్ ప్రాంతంలో ఎక్కువసేపు ట్రాఫిక్‌లో ఇరుక్కోవాల్సిన పరిస్థితి ఉండదు.

35
యాక్టివ్ రన్‌వే కింద అండర్‌పాస్

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఎయిర్‌పోర్ట్ రన్‌వే కింద అండర్‌పాస్ నిర్మించడం దేశంలో ఇదే మొదటిసారి అని తెలిపారు. ప్రపంచంలో కూడా ఇలాంటి నిర్మాణాలు చాలా అరుదుగా ఉన్నాయని చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అవసరమైన అనుమతులు తీసుకున్నామని, ప్రస్తుతం పనులు కూడా ముందుకు సాగుతున్నాయని ఆయన వివరించారు. కంటోన్మెంట్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని పేర్కొన్నారు.

45
‘తెలంగాణ రైజింగ్ 2047’లో భాగంగా మౌలిక వసతుల విస్తరణ

హైదరాబాద్ నగరాన్ని భవిష్యత్తులో అధిక ట్రాఫిక్, కాలుష్య సమస్యలతో బాధపడే నగరంగా కాకుండా సమతుల్యంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందని సీఎం తెలిపారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌లో భాగంగా అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్లు, మెరుగైన రోడ్లు నిర్మించి నగర మౌలిక వసతులను బలోపేతం చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. దీనివల్ల ట్రాఫిక్ ప్రవాహం మెరుగుపడి ప్రయాణ సమయం తగ్గుతుందని భావిస్తున్నారు.

55
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం – భారీ ప్రణాళిక

ప్యారడైజ్ జంక్షన్ నుంచి తాడ్‌బండ్, బోవెన్‌పల్లి మీదుగా మిలిటరీ డైరీ ఫామ్ రోడ్డు వరకు సుమారు 5.3 కిలోమీటర్ల పొడవుతో ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.1,580 కోట్లు. భవిష్యత్తులో ఇదే కారిడార్‌పై మెట్రో రైలు మార్గాన్ని కూడా డబుల్ డెక్కర్ విధానంలో నిర్మించే అవకాశం ఉంది. ఈ ఏడాది మార్చి 9న కండ్లకోయలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో 4.6 కిలోమీటర్లు ఎత్తుగా ఉండగా, సుమారు 0.6 కిలోమీటర్ల భాగం సొరంగ మార్గంగా ఉంటుంది. ఆరు లేన్ల కారిడార్‌కు 131 పిల్లర్లు నిర్మించనున్నారు. బోయిన్‌ప‌ల్లి జంక్షన్ వద్ద ట్రాఫిక్ సులభంగా మలుపు తిరగేందుకు రెండు వైపులా ర్యాంపులు కూడా ఏర్పాటు చేయనున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories