తెలంగాణలో రాత్రి నుంచే వర్షం దంచికొడుతోంది. హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం నమోదైంది. సరూర్ నగర్లో అత్యధికంగా 112 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా.. ఉప్పల్లో 81.3 మిల్లీ మీటర్లు, బండ్లగూడలో 79.5 మిల్లీ మీటర్లు, హయత్నగర్లో 72.5 మిల్లీ మీటర్ల వర్షపాతం పడింది. తూర్పు తెలంగాణలో పడుతున్న వర్షాలు మధ్యాహ్నానికి కాస్త తగ్గుముఖం పట్టినా.. మధ్యాహ్నం నుంచి రాత్రి సమయానికి దక్షిణ, తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మళ్లీ వర్షాలు జోరందుకుంటాయని వాతావరణ శాఖ తెలిపింది.
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, నిజామాబాద్, సిరిసిల్ల, మెదక్ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. హైదరాబాద్లో మధ్యాహ్నం వరకు వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ, సాయంత్రం లేదా రాత్రి సమయంలో వాన పడే ఛాన్స్ ఉంది. అలాగే, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కామారెడ్డి, హనుమకొండ, జగిత్యాల, కరీంనగర్, వరంగల్, వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, నల్గొండ, జనగామ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.