PKL 2021: మోత మోగించిన యు ముంబా.. పీకేఎల్ లో తొలి కూత ముంబైదే..

First Published Dec 22, 2021, 9:38 PM IST

Pro Kabaddi League 8: ఐపీఎల్ తర్వాత అంతటి క్రేజ్ సంపాదించుకున్న ప్రో కబడ్డీ లీగ్ గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. తొలి  మ్యాచులో  యు ముంబా.. బెంగళూరు బుల్స్ ను ఓడించింది. 

రెండేండ్ల తర్వాత దేశవ్యాప్తంగా కబడ్డీ అభిమానులు ఎదురుచూసిన పండుగ రానే వచ్చింది.  ప్రో కబడ్డీ లీగ్ తొలి మ్యాచులో యు ముంబా జట్టు..  బెంగళూరు బుల్స్ ను వారి స్వంత గడ్డమీదే మట్టి కరిపించింది. 

బెంగళూరులోని షెరటాన్ గ్రాండ్ బెంగళూరు వైట్ ఫీల్డ్ హోటల్ లో జరిగిన తొలి మ్యాచ్ లో యు ముంబా.. 46-30 తేడాతో బెంగళూరును ఓడించింది. 

ఆధ్యంతం ఉత్కంఠగా సాగిన తొలి పోరులో భాగంగా..  ఫస్ట్ హాఫ్ నుంచే యు ముంబా.. బెంగళూరుపై ఆధిపత్యం కొనసాగించింది.ఆటలోని తొలి  హాఫ్ లో బెంగళూరు 17 పాయింట్లు సాధించగా.. ముంబా 24 పాయింట్లు దక్కించుకుంది. 

ఇక రెండో హాఫ్ లో బెంగళూరు 13 పాయింట్లు చేయగా.. యు ముంబా 22 పాయింట్లు తన ఖాతాలో వేసుకుంది. యు  ముంబా తరఫున అభిషేక్ 19 పాయింట్లు సాధించగా.. బెంగళూరు కెప్టెన్ పవన్ 12  రైడ్ పాయింట్లు తీసుకొచ్చాడు.

ఇదిలాఉండగా.. ఈ మ్యాచ్ కు కామెంట్రీ బాక్సుల్లో ఆర్ఆర్ఆర్ టీమ్ సందడి  చేసింది. తెలుగులో ప్రసారమైన షోలో రామ్ చరణ్ పాల్గొనగా.. కన్నడలో ఎన్టీఆర్ సందడి చేశాడు. ఈ సందర్భంగా  ఎన్టీఆర్ కన్నడలో మాట్లాడటం విశేషం. 

click me!