తెలుగు ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డికి గంభీర్ షాక్

Published : Nov 12, 2025, 07:52 PM IST

India South Africa Test: దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌కు ముందు తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డికి గంభీర్ షాక్ ఇచ్చాడు. అతన్ని భారత జట్టు నుంచి అవుట్ చేశారు. నితీష్ ఇప్పుడు ఇండియా ‘A’ జట్టుతో రాజ్‌కోట్‌లో ఆడనున్నారు.

PREV
16
నితీష్ కుమార్ రెడ్డి అవుట్.. కోల్‌కతా టెస్ట్‌కు ముందు గంభీర్ నిర్ణయం

భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండు టెస్ట్‌ల సిరీస్‌కు ముందు టీమిండియా మేనేజ్‌మెంట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గౌతమ్ గంభీర్ తెలుగు ప్లేయర్ కు షాక్ ఇచ్చాడు. నవంబర్ 14న కోల్‌కతాలో జరగనున్న తొలి టెస్ట్ మ్యాచ్‌కు ముందు యంగ్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని జట్టు నుంచి ఔట్ చేశారు. అసిస్టెంట్ కోచ్ ర్యాన్‌ టెన్‌ విలేకరుల సమావేశంలో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.

26
కోల్‌కతా టెస్ట్‌కు ముందు మార్పులు ఎందుకు?

గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్న రిషభ్ పంత్ తిరిగి రావడంతో జట్టులో బ్యాటింగ్ కాంబినేషన్ మారింది. ధ్రువ్ జురెల్ స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఆడనున్నందున నితీష్‌ కుమార్ కు తొలి టెస్టులో స్థానం లభించలేదు. ఫలితంగా, గంభీర్ ఆధ్వర్యంలోని కోచ్ బృందం అతన్ని ప్రస్తుత టెస్ట్ సిరీస్‌లో కాకుండా, ప్రాక్టీస్, ఫిట్‌నెస్ పెంపొందించే ఉద్దేశంతో ఇండియా ‘A’ జట్టుకు పంపించారు.

36
రాజ్‌కోట్‌లో ఇండియా ‘A’ జట్టుతో ఆడనున్న నితీష్ కుమార్ రెడ్డి

నితీష్ కుమార్ రెడ్డి ఇప్పుడు తిలక్ వర్మ సారథ్యంలో ఆడుతున్న ఇండియా ‘A’ వర్సెస్ దక్షిణాఫ్రికా ‘A’ లిస్ట్ ‘A’ సిరీస్‌లో పాల్గొననున్నారు. ఇప్పటికే రాజ్‌కోట్‌లో జట్టుతో కలిసిన నితీష్, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆడే అవకాశం ఉంది. ఇది అతనికి గాయం తర్వాత మ్యాచ్ ఫిట్‌నెస్ తిరిగి పొందేందుకు మంచి అవకాశం అవుతుందని టీం మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

46
గాయాల తర్వాత పునరాగమనంలో నితీష్

22 ఏళ్ల నితీష్ కుమార్ రెడ్డి ఇటీవల కాలంలో గాయాలతో సతమతమయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో రాణించినప్పటికీ, క్వాడ్రిసెప్స్ గాయం కారణంగా T20 సిరీస్ మిస్ అయ్యాడు. తర్వాత మెడ నొప్పులు అతని ఫిట్‌నెస్‌ను ప్రభావితం చేశాయి. ఇప్పుడు అతన్ని రెడ్ బాల్ క్రికెట్‌లో బెంచ్ చేయకుండా, మ్యాచ్ ప్రాక్టీస్‌కి అవకాశం ఇవ్వడం ద్వారా యాజమాన్యం అతని రిథమ్ తిరిగి వచ్చేలా చూస్తోంది.

56
భారత జట్టు ప్రస్తుత టెస్ట్ స్క్వాడ్ ఇదే

భారత టెస్ట్ జట్టు (దక్షిణాఫ్రికా సిరీస్)

బ్యాటర్లు: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్, దేవదత్ పడిక్కల్

వికెట్ కీపర్: రిషభ్ పంత్

ఆల్‌రౌండర్లు: రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్

బౌలర్లు: జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాష్ దీప్

ఈ స్క్వాడ్‌లో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ వంటి స్థిరమైన ఆల్‌రౌండర్లు ఉన్నందున, నితీష్‌కు ప్రస్తుతం అవకాశాలు తక్కువగానే ఉన్నాయి.

66
ఈ నిర్ణయం వెనుక వ్యూహాత్మక కారణాలు

టీమిండియా యాజమాన్యం దీన్ని పూర్తిగా వ్యూహాత్మక నిర్ణయంగా తీసుకుంది. భవిష్యత్తులో అన్ని ఫార్మాట్‌లకు సరిపోయే పేస్ ఆల్‌రౌండర్‌గా నితీష్‌ కుమార్ ను తీర్చిదిద్దాలని మేనేజ్‌మెంట్ లక్ష్యంగా పెట్టుకుందని సమాచారం. హార్దిక్ పాండ్యా తరచుగా గాయపడుతున్న సందర్భంలో, రాబోయే సిరీస్‌లకు నితీష్ రెడ్డిని సిద్ధం చేయాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇక నితీష్‌కు ఇండియా ‘A’ తరపున 50 ఓవర్ల క్రికెట్‌లో అనుభవం పెరిగితే, భవిష్యత్తులో సీనియర్ జట్టులో తిరిగి అవకాశం రావడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories