Egg Price : ఒక్క కోడిగుడ్డు ధర రూ.25,000.. ఈ ఎగ్ ఎంత స్పెషలో తెలుసా..?

Published : Apr 06, 2026, 11:41 AM IST

Egg Price : కేవలం ఒక్క ఎగ్ ధర ఏకంగా రూ.25 వేలా..? ఈ ధర విని ఆశ్చర్యపోతున్నారా..? ఈ ధర ఎక్కడో కాదు మన దేశంలోనే. ఈ కోడిగుడ్డు రికార్డు ధర వెనక ఆసక్తికరమైన స్టోరీ ఉంది.. అదేంటో తెలుసుకుందాం.

PREV
14
ఒక్క గుడ్డు ధర ఇంతా..!

Egg Price : సాధారణంగా కోడిగుడ్డు ధర ఎంతుంటుంది..? ఇండియాలో ఎక్కడికి వెళ్లినా రూ.5 నుండి రూ.10 వరకు ఉంటుంది. ఇంకా కాస్ట్లీ అంటే డజన్ రూ.100 వరకు ఉంటాయి. కానీ ఒక్కటి... కేవలం ఒకేఒక్క కోడిగుడ్డు ధర ఏకంగా రూ.25 వేలు. అవును.. మీరు వింటున్నది నిజమే... ఓ కోడిగుడ్డును అక్షరాలా ఇరవైఐదు వేలకు అమ్ముడుపోయింది. ఒక్క గుడ్డు ధర ఇంతా..! అని ఆశ్చర్యపోతున్నారా... అయితే కాస్ట్లీ ఎగ్ వెనకున్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

24
లద్దాఖ్ ఎగ్ కు రికార్డు ధర..

ప్రస్తుతం ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడులకు దిగింది... కేవలం ఆర్మీ, అణు స్ధావరాలనే కాదు సామాన్య ప్రజలను కూడా టార్గెట్ చేస్తోంది.. స్కూళ్లు, జనావాసాలపై కూడా దాడులు చేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఇరాన్ ప్రజలకు ఇండియా మానవతా దృక్పథంలో సాయం చేస్తోంది. ప్రజలు కూడా ఇరాన్ కు సాయంగా విరాళాలు సేకరిస్తున్నారు.

ఇరాన్ కోసం భారతీయులు వివిధ రకాలుగా విరాళాలు సేకరిస్తున్నారు... ఇలా ఇటీవల లద్దాఖ్ లో చేపట్టిన విరాళాల సేకరణ యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. లేహ్ లో ఓ కోడిగుడ్డును వేలం వేశారు... ఇందులో వచ్చే మొత్తాన్ని ఇరాన్ కు అందిస్తామని ప్రకటించారు. దీంతో షబ్బీర్ హుస్సేన్ అనే వ్యక్తి ఈ గుడ్డును ఏకంగా రూ.25 వేలకు దక్కించుకున్నాడు. ఇలా ఇరాన్ ప్రజలకు ఒక్క కోడిగుడ్డు భారీ సాయాన్ని అందించింది.

34
ఇరాన్ చిన్నారుల కోసం ఇండియా సాయం...

ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా బాంబు దాడులు కొనసాగుతున్నాయి. పైకి ఇరాన్ ఈ దాడులకు తిప్పికొడుతున్నట్లు గంభీరంగానే కనిపిస్తోంది.. కానీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటాయి... దీంతో ఆకలిబాధలు పెరిగిపోయాయి. తినడానికే తిండిలేదు... ఇక పౌష్టికాహారం గురించి మాట్లాడే పరిస్థితే లేదు.

ఇరాన్ లో చిన్నారులు తీవ్ర అణచివేతకు గురవుతున్నారు... పౌష్టికాహారం లోపంతో బాధపడుతున్నారు. వీరికి సాయంగానే లద్దాఖ్ లో పౌష్టికాహారం అయినా కోడిగుడ్డును వేలం వేశారు. ఇదికాస్తా రికార్డు ధర పలికింది. ఈ రూ.25 వేలతో పాటు వివిధ పద్దతుల్లో సేకరించిన విరాళాలను ఇరాన్ లో చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు ఉపయోగిస్తామని నిర్వహకులు చెబుతున్నారు.

44
ధరాభారంతో ఇరాన్ ప్రజలు విలవిల..

యుద్దం ఎఫెక్ట్ ఇరాన్ ప్రజలపై గట్టిగానే పడింది... వారి జీవితాలను తలకిందులు చేసింది. ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసరాల ధరలు లక్షలకు చేరాయి. ఇరాన్ లో లీటర్ పాలు 6,50,000, కిలో బియ్యం 2.8 మిలియన్ల ఇరానియన్ రియాల్ పలుకుతోంది... దీన్నిబట్టే ధరలు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. డజను గుడ్లు కూడా 1.5 మిలియన్ ఇరానియన్ రియాల్ ఉంది. యుద్దం కారణంగా ఇరానియల్ రియాల్ కరెన్సీ పతనం అయ్యింది... దీంతో ఏకంగా కోటి రూపాయల విలువైన కరెన్సీని కూడా వాడుకలో తెచ్చింది.

Read more Photos on
click me!

Recommended Stories