పాముకాటుతో చ‌నిపోయాడ‌ని గంగా న‌దిలో వ‌దిలేశారు.. క‌ట్ చేస్తే, 8 ఏళ్ల త‌ర్వాత ఊహించ‌ని ట్విస్ట్

Published : Aug 09, 2026, 05:28 PM IST

Viral News: బీహార్‌లో జరిగిన ఒక విచిత్ర ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పాముకాటుతో చనిపోయాడని భావించి గంగానదిలో వదిలేసిన బాలుడు.. ఎనిమిదేళ్ల తర్వాత సన్యాసి వేషంలో తిరిగి తన గ్రామానికి వ‌చ్చిన సంఘ‌ట‌న అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

PREV
15
పాముకాటుతో చనిపోయాడని భావించిన కుటుంబం

బీహార్‌లోని బేగుసరాయ్ జిల్లా మనోపూర్ ముషహరి గ్రామానికి చెందిన రాహుల్ అనే 12 ఏళ్ల బాలుడు ఎనిమిదేళ్ల క్రితం పాముకాటుకు గురయ్యాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మొదట అతడిని ఓ మంత్రగాడి వద్దకు తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో తర్వాత వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అయితే అప్పటికే రాహుల్ చనిపోయాడని వైద్యుడు చెప్పడంతో కుటుంబ సభ్యులు అతడి మృతదేహాన్ని గంగానదిలో నిమజ్జనం చేశారు.

25
ఎనిమిదేళ్ల తర్వాత సన్యాసి రూపంలో

ఇటీవల ఒక యువ సన్యాసి చేతిలో సారంగి పట్టుకుని గ్రామానికి వచ్చాడు. తానే ఎనిమిదేళ్ల క్రితం చనిపోయాడని భావించిన రాహుల్‌నని చెప్పడంతో గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. అతడు నేరుగా తన తల్లిని గుర్తించడమే కాకుండా తండ్రి, అన్న, బాబాయి, అత్త పేర్లను కూడా చెప్పాడని కుటుంబ సభ్యులు వెల్లడించారు. చిన్నప్పుడే శరీరంపై ఏర్పడిన గాయం గుర్తును కూడా గ్రామస్థులు గుర్తించి, ఇతడే రాహుల్ అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

35
అస‌లేం జ‌రిగిందంటే.?

ఆ యువకుడు చెప్పిన కథ మరింత ఆసక్తికరంగా ఉంది. గంగలో తనను వదిలేసినప్పుడు తాను పూర్తిగా చనిపోలేదని, ఇంకా శ్వాస తీసుకుంటున్నానని తెలిపాడు. నదిలో కొట్టుకుపోతూ మొకామా ఘాట్‌కు చేరుకున్నానని, అక్కడ ఉన్న ఓ సాధువు తనను రక్షించి గోరఖ్‌పూర్‌కు తీసుకెళ్లాడని చెప్పాడు. అక్కడే ఆధ్యాత్మిక విద్య నేర్పించి, ఎన్నేళ్ల పాటు సన్యాస జీవితం గడిపించిన తర్వాత తన గురువు "నీ తల్లి దగ్గరకు వెళ్లి భిక్ష అడుగు" అని పంపించాడని వివరించాడు.

45
రూ.2 లక్షలు ఇవ్వాల‌ని..

రాహుల్‌ గ్రామంలో కొద్దిసేపు గడిపిన తర్వాత తిరిగి గోరఖ్‌పూర్ వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు అతడికి మొబైల్ ఫోన్ కూడా కొనిచ్చారు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత ఫోన్ చేసి, తన గురువుకు చికిత్స, పెంపకం కోసం ఖర్చైన డబ్బుగా రూ.2 లక్షలు ఇవ్వాలని, అప్పుడే శాశ్వతంగా ఇంటికి వస్తానని చెప్పాడని కుటుంబ సభ్యులు తెలిపారు. పేద కూలీ కుటుంబం కావడంతో అంత పెద్ద మొత్తాన్ని వెంటనే సమకూర్చలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

55
డీఎన్‌ఏ పరీక్ష చేయాలంటున్న హేతువాదులు

ఈ ఘటనపై హేతువాద సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. నిజంగా ఇతడే రాహుల్ కాదా అన్నది నిర్ధారించేందుకు జిల్లా యంత్రాంగం, పోలీసులు విచారణ చేపట్టాలని కోరుతున్నాయి. పుట్టిన ధ్రువపత్రాలు, పాత రికార్డులు, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు పరిశీలించడంతో పాటు అవసరమైతే DNA పరీక్ష కూడా నిర్వహించాలని సూచిస్తున్నాయి. శాస్త్రీయ ఆధారాలతో నిజానిజాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని వారు అంటున్నారు. ప్రస్తుతం ఈ ఘటన బీహార్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

Read more Photos on
click me!

Recommended Stories