ఏమిటీ.. తీర్థయాత్రకు వెళితే లక్ష రూపాయలు ఇస్తారా..!

Published : Mar 18, 2026, 07:56 PM IST

కైలాస మానస సరోవర యాత్ర పూర్తి చేసుకుని వచ్చిన 555 మంది యాత్రికులకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించింది. మతపరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడంపై దృష్టి సారించిన యోగి సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 

PREV
15
యాత్రికులకు రూ.1 లక్ష సాయం

విశ్వాసం, ధైర్యం, నమ్మకం... ఈ మూడు మాటలతోనే కైలాస మానస సరోవర యాత్రను వర్ణిస్తారు. ఈ కఠినమైన యాత్రను పూర్తి చేసుకుని వచ్చిన భక్తుల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక అడుగు వేసింది. లక్నోలోని లోక్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ 555 మంది యాత్రికులకు తలా లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు… 10 మందికి ప్రతీకాత్మకంగా చెక్కులు అందజేశారు. ఇది కేవలం సాయం మాత్రమే కాదని, కఠిన పరిస్థితుల్లో యాత్ర పూర్తి చేసిన వారికి ఇచ్చే గౌరవమని ప్రభుత్వం పేర్కొంది.

25
తీర్థయాత్ర కేవలం విశ్వాసం కాదు, ఐక్యతకు మార్గం

భారత్‌లో తీర్థయాత్రల సంప్రదాయం కేవలం మతపరమైనది కాదని, సమాజాన్ని, దేశాన్ని ఏకం చేసే బలమైన మార్గమని సీఎం యోగి అన్నారు. కైలాస మానస సరోవర యాత్ర మానసికంగా, ఆధ్యాత్మికంగా మనల్ని దృఢంగా మారుస్తుందని చెప్పారు. ఆది శంకరాచార్యులు నాలుగు దిక్కులా పీఠాలు స్థాపించడం కూడా ఇదే ఐక్యతా భావనకు నిదర్శనమని గుర్తుచేశారు. 

ప్రస్తుతం పుణ్యక్షేత్రాలకు భక్తుల సంఖ్య వేగంగా పెరుగుతోందని, 2025లో రాష్ట్రానికి సుమారు 164 కోట్ల మంది భక్తులు వచ్చారని, వీరిలో 66 కోట్ల మంది ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్‌లో పాల్గొన్నారని తెలిపారు. వారణాసి, అయోధ్య, మధుర బృందావన్ వంటి పుణ్యక్షేత్రాలకు పెరుగుతున్న రద్దీని ప్రభుత్వం ఒక సవాలుగా, మరోవైపు అభివృద్ధికి అవకాశంగా చూస్తోంది.

35
సౌకర్యాలపై ప్రభుత్వం దృష్టి

తీర్థయాత్రలను సులభతరం, సురక్షితం చేయడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. ఘజియాబాద్‌లో కైలాస మానస సరోవర్ భవన్ నిర్మాణం చేపట్టారు. యాత్రకు సంబంధించిన అధికారిక ప్రక్రియలను సులభతరం చేస్తున్నారు. పుణ్యక్షేత్రాలలో రవాణా, బస, వైద్య సౌకర్యాలను విస్తరించేందుకు చర్యలు చేపట్టారు. వీటితో పాటు, యాత్రికుల అవసరాలకు అనుగుణంగా విదేశాంగ మంత్రిత్వ శాఖతో కలిసి కొత్త ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.

45
మతపరమైన పర్యాటకంతో పెరుగుతున్న ఉపాధి
మతపరమైన పర్యాటకం కేవలం విశ్వాసానికే పరిమితం కాదని, అది ఉపాధి, ఆర్థికాభివృద్ధికి పెద్ద మార్గంగా మారిందని సీఎం యోగి స్పష్టం చేశారు. ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్ దీనికి అతిపెద్ద ఉదాహరణ అని అన్నారు. కోట్లాది మంది భక్తులు రావడంతో స్థానిక వ్యాపారాలు, రవాణా, హోటల్ పరిశ్రమకు భారీగా ప్రయోజనం చేకూరిందని వివరించారు.
55
వదంతుల నడుమ విశ్వాసమే గెలిచింది

మహాకుంభ్ సమయంలో కొందరు వదంతులు వ్యాప్తి చేయడానికి ప్రయత్నించారని, కానీ భక్తులు వాటిని తిరస్కరించారని ముఖ్యమంత్రి అన్నారు. సుదూర ప్రాంతాల నుంచి కాలినడకన సంగం చేరుకున్న ప్రజల భక్తి, విశ్వాసం ముందు ఎలాంటి కష్టాలైనా చిన్నవేనని నిరూపించిందని చెప్పారు. ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఇతర పెద్ద యాత్రలను కూడా సులభతరం చేయడానికి సిద్ధమవుతోందని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.  

Read more Photos on
click me!

Recommended Stories