విజ‌య్ ప్ర‌మాణ స్వీకార వేడుక‌లో.. త్రిష‌తో పాటు అంద‌రిని ఆక‌ర్షించిన ఈ మ‌హిళ ఎవ‌రో తెలుసా?

Published : May 14, 2026, 03:46 PM IST

TVK Vijay: తమిళనాడు ముఖ్యమంత్రిగా విజ‌య్ ప్రమాణ స్వీకారం చేసిన కార్య‌క్ర‌మంలో త్రిష అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన విషయం తెలిసిందే. అయితే ఇదే స‌భ‌లో క‌నిపించిన మ‌రో మ‌హిళ వార్త‌ల్లో నిలిచారు. ఇంత‌కీ ఈమె ఎవరు.? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా.?  

PREV
15
విజయ్ ప్రమాణ స్వీకార వేడుకలో త్రిష‌ ప్రత్యేక ఆకర్షణ

తమిళనాడు రాజకీయాల్లో ద్రావిడ పార్టీల ఆధిపత్యం కొనసాగుతున్న సమయంలో విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం రాజ‌కీయంగా పెనుమార్పును తీసుకొచ్చింది. ఈ ప్ర‌మాణ స్వీకారం కార్యక్రమానికి సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ముందువరుసలో కూర్చున్న నటి త్రిష్ అందరి దృష్టిని ఆక‌ర్షించారు. విజయ్ కుటుంబ సభ్యుల పక్కన ఆమె కూర్చోవడం కొత్త రాజకీయ ఊహాగానాలకు దారితీసింది. విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి నియోజకవర్గం నుంచి త్రిష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశముందనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది అయితే దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు.

25
అందరి చూపు దోచుకున్న డైసీ మార్టిన్

ఇదిలా ఉంటే.. ఇదే కార్యక్రమంలో మరో మహిళ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె డైసీ మార్టిన్. ప్రముఖ వ్యాపార సంస్థ అరైజ్ ఇన్వెస్ట్‌మెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న డైసీ, తన భర్త ఆధవ్ అర్జున్ మంత్రి పదవి స్వీకరిస్తున్న సమయంలో భావోద్వేగానికి గురయ్యారు. కళ్లలో ఆనందభాష్పాలతో చప్పట్లు కొడుతున్న ఆమె దృశ్యాలు అక్కడున్న వారిని ఆకట్టుకున్నాయి. దీంతో ఆమెపై కూడా మీడియా దృష్టి పడింది.

35
పేద కుటుంబం నుంచి మంత్రి పదవి వరకు ఆధవ్ ప్రయాణం

ఆధవ్ అర్జున్ జీవితం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో ప్రేరణాత్మక కథగా మారింది. ఒకప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న కుటుంబం నుంచి వచ్చిన ఆయన బాస్కెట్‌బాల్ ఆటగాడిగా గుర్తింపు పొందారు. తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి క్రమంగా ఎదిగారు. ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడంపై విమర్శలు వచ్చిన సమయంలో “నా లాంటి వ్యక్తి ధనిక కుటుంబంలో పెళ్లి చేసుకోకూడదా?” అంటూ ఆయన ఇచ్చిన సమాధానం అప్పట్లో పెద్ద చర్చగా మారింది. ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో అత్యంత ధనిక నేతల్లో ఒకరిగా ఆయన పేరు వినిపిస్తోంది.

45
మార్టిన్ కుటుంబం రాజకీయ ప్రభావం

డైసీ మార్టిన్ కుటుంబం తమిళనాడులో అత్యంత ప్రభావశీల కుటుంబాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఆమె తండ్రి సాంటియాగో మార్టిన్‌ను లాటరీ వ్యాపార ప్రపంచంలో ప్రముఖుడిగా భావిస్తారు. ప్రస్తుతం ఈ కుటుంబం నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండటం రాజకీయంగా వారి బలం ఎంత ఉందో చూపిస్తోంది. డైసీ తల్లి లిమా రోజ్ మార్టిన్ ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు.

55
కుటుంబ వివాదాలు కూడా..

ఈ రాజకీయ విజయాల మధ్య కుటుంబ వివాదాలు కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. డైసీ సోదరుడు జోసెఫ్ చార్లెస్ మార్టిన్ బహిరంగంగా ఆధవ్ అర్జున్‌పై ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. పలువురు మహిళలతో సంబంధాలు కొనసాగిస్తున్నారని, వారికి ఖరీదైన కార్లు బహుమతిగా ఇచ్చారనే ఆరోపణలు చేశారు. కుటుంబ సభ్యుల నుంచే వచ్చిన ఈ విమర్శలు తమిళ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీశాయి. మొత్తానికి విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కేవలం రాజకీయ వేడుకగానే కాకుండా, అనేక ఆసక్తికర కథనాలకు అడ్రస్ గా మారింది.

Read more Photos on
click me!

Recommended Stories