గాలి కాలుష్యం:
దేశ జనాభాలో 46% మంది సురక్షిత పరిమితి కంటే అధిక PM2.5 ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారు. బైర్నిహాట్ నగరంలో: 200 µg/m³ కంటే ఎక్కువ, ఢిల్లీ: 165 µg/m³ (2025 అక్టోబర్). ఇది ఆరోగ్యం, ఆయుష్షుపై నేరుగా ప్రభావం చూపుతోంది.
నీటి నాణ్యత:
కలుషిత నదులు: 2018లో 351 → 2025లో 296
రాజస్థాన్, హర్యాణా, ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్వాటర్లో ఫ్లోరైడ్, ఇతర రసాయనాలు అధికంగా ఉంది.
ఆహార కల్తీ:
FSSAI రిపోర్ట్: 33,000కుపైగా అసురక్షిత ఆహార నమూనాలు (2023–24). నోయిడాలో పన్నీర్ నమూనాల్లో 40% సురక్షితంగా లేదు. పాలు, పండ్లు, మసాలాల్లో కూడా విస్తృత కల్తీ జరుగుతోంది.
మౌలిక వసతులు:
పంజాబ్, హర్యాణా వంటి రాష్ట్రాలు బాగున్నా, కొన్ని రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయి.
భారత్మాల ప్రాజెక్ట్లో 19,000 కి.మీ రోడ్లు నిర్మించినా, అనేక పట్టణాల్లో ట్రాఫిక్, సేవల లోటు కొనసాగుతోంది.