కర్నాటకలో స్పా ముసుగులో వ్యభిచారం.. పలువురు అరెస్ట్...

First Published Aug 8, 2023, 11:22 AM IST

అర్థరాత్రి ప్రియురాలికి పిజ్జా తీసుకెళ్లిన ఓ యువకుడు అనుకోకుండా నాలుగో అంతస్తునుంచి జారి పడి మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్ బోరబండలో జరిగింది. 

కర్ణాటక : కర్ణాటకలోని బళ్లారిలో స్పాసెంటర్లో ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. నగరంలోని అనేక ప్రముఖ లాడ్జిలు,హోటళ్లు స్పా సెంటర్ల పేరుతో అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడుతున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో తనిఖీలు నిర్వహించిన పోలీసులకు వ్యభిచార నిర్వహిస్తున్నట్లుగా తేలింది. 

ఆదివారం రాత్రి నగరంలోని ఇన్ ఫ్యాంట్రీ రోడ్డులో వేశ్య వాటికపై కౌలు బజార్ పోలీసులు మెరుపు దాడి చేశారు. వీరి దాడిలో పలువురు మహిళలను రక్షించారు. ఈ స్పా సెంటర్ ను ప్రభు గౌడ నిర్వహిస్తున్నాడు.

అతనితోపాటు మరో ఏడు మందిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సెంటర్లో వ్యభిచారం నిర్వహిస్తున్న నాగాలాండ్, ఒడిశా, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్లో కు చెందిన పలువురు మహిళలను రక్షించారు.  

అసాంఘిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న వారిని పట్టుకున్నారు. నగరంలో కొద్దికొద్దికాలంగా స్పా సెంటర్లో ముసుగులో అసాంఘిక కార్యక్రమాలు,  వ్యభిచార కార్యక్రమాలు జరుగుతున్నాయని జోరుగా ప్రచారం సాగుతోంది.

పోలీసులు చూసి చూడనట్లుగా ఉంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిమీద పోలీసులు సీరియస్ అయ్యారు. వెంటనే చర్యలు చేపట్టారు.

దీంతోనే పోలీసులు ప్రముఖ లాడ్జిలు, హోటళ్లు  నిర్వహిస్తున్న స్పా సెంటర్ల మీద దాడులు నిర్వహిస్తున్నారు. పైన బోర్డులకి మసాజ్ సెంటర్లు అనే పేరు పెడుతూ లోపల చేసే అక్రమ పనులు చూసి అవాక్కయ్యారు. 

click me!