ప్రధాని మోడీ థాయ్లాండ్, శ్రీలంకలో మూడు రోజుల పర్యటనకు బయలుదేరారు. బిమ్స్టెక్ సదస్సుతో పాటు చాలా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ టూర్ రెండు దేశాలతో ఇండియా సహకారాన్ని పెంచేందుకు ఉద్దేశించింది. ఈ మోదీ పర్యటకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
శ్రీలంక, థాయ్లాండ్లో ప్రధాని మోడీ మూడు రోజుల పర్యటన
PM Modi Tour: ప్రధాని నరేంద్ర మోడీ గురువారం థాయ్లాండ్, శ్రీలంకలో మూడు రోజుల టూర్కు బయలుదేరారు. తన టూర్లో బిమ్స్టెక్ సదస్సుతో పాటు పలు ఈవెంట్లలో పాల్గొననున్నారు. ఈ టూర్ ఈ దేశాలతో ఇండియా సహకారాన్ని పెంచే లక్ష్యంతో ఉంటుందని మోడీ తన ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు.
24
6వ బిమ్స్టెక్ సదస్సు
బిమ్స్టెక్ సదస్సు:
పర్యటనకు సంబంధించి ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. రాబోయే మూడు రోజుల్లో థాయ్లాండ్, శ్రీలంకలో పర్యటించి, ఆ దేశాలు, బిమ్స్టెక్ దేశాలతో ఇండియా సహకారాన్ని పెంచే లక్ష్యంతో పలు కార్యక్రమాల్లో పాల్గొంటానని.. గురువారం సాయంత్రం బ్యాంకాక్లో ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రాతో కలిసి ఇండియా-థాయ్లాండ్ స్నేహం గురించి చర్చిస్తానని తెలిపారు. అలాగే శుక్రవారం బిమ్స్టెక్ సదస్సులో పాల్గొంటానన్న మోదీ.. థాయ్లాండ్ రాజు మహా వజిరలోంగ్కోర్న్ను కూడా కలుస్తానని రాసుకొచ్చారు.
34
శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సానాయకేతో ప్రధాని మోడీ
శ్రీలంక టూర్:
మరో పోస్ట్లో తన శ్రీలంక టూర్ గురించి ప్రధాని మాట్లాడుతూ, అధ్యక్షుడు అనుర కుమార దిస్సానాయకే విజయవంతమైన ఇండియా టూర్ తర్వాత తాను ఆ దేశానికి వెళ్తున్నట్లు చెప్పారు.
44
ఇండియా-శ్రీలంక స్నేహం:
నా శ్రీలంక టూర్ 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఉంటుంది. అధ్యక్షుడు అనుర కుమార దిస్సానాయకే విజయవంతమైన ఇండియా పర్యటన తర్వాత ఈ టూర్ జరుగుతోంది. ఇండియా-శ్రీలంక స్నేహం గురించి మేం చర్చిస్తాం. ద్వైపాక్షిక సహకారాన్ని కొత్త మార్గాల్లో ముందుకు తీసుకెళ్లడం గురించి కూడా చర్చిస్తాం. శ్రీలంకలో జరిగే చర్చల కోసం నేను ఆతృతగా ఎదురు చూస్తున్నానను అని ప్రధాని తన ఎక్స్ లో పోస్ట్ చేశారు.