2014లో ప్రధాని పదవిని స్వీకరించినప్పటి నుంచీ మోదీ ప్రతి దీపావళి పండుగను సరిహద్దుల్లోని సైనికులతో కలిసి జరుపుకుంటున్నారు.
2014లో సియాచిన్ గ్లేసియర్లో ఆర్మీ సిబ్బందితో కలిసి దీపావళి జరిపారు.
2018లో ఉత్తరాఖండ్లోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ దళాలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు.
2022లో కార్గిల్లో సైనికులతో కలిసి దీపాలు వెలిగించారు.
2023లో హిమాచల్ప్రదేశ్లోని లేప్చా సైనిక శిబిరంలో దీపావళి జరిపారు.
2024లో కచ్ ప్రాంతంలోని సర్ క్రీక్ వద్ద ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో కలిసి పండుగ చేసుకున్నారు.
ఇక 2025లో గోవా తీరంలోని ఐఎన్ఎస్ విక్రాంత్ పై నావికులతో కలిసి దీపావళి జరుపుకోవడం ద్వారా ఈ ప్రత్యేక సంప్రదాయానికి కొత్త అధ్యాయం జోడించారు.