సింధు జల ఒప్పందం నిలిపివేత ప్రభావం ఏమిటి?
సింధు జల ఒప్పందం సింధు, దాని ఆరు ఉపనదులను రెండు వర్గాలుగా విభజిస్తుంది.
పశ్చిమ నదులు: సింధు, జీలం, చీనాబ్ నదులను ప్రత్యేకంగా పాకిస్తాన్కు కేటాయించారు.
తూర్పు నదులు: రావి, బియాస్, సట్లెజ్ నదుల నీటిపై భారత్కు పూర్తి నియంత్రణ ఉంది.
భారత్ పశ్చిమ నదుల నీటిని తాగునీరు, వ్యవసాయం, జలవిద్యుత్ వంటి పరిమిత అవసరాలకు ఉపయోగించుకోవచ్చు, కానీ అదనపు నీటిని మళ్లించలేదు. నీటిని నిల్వ చేయలేదు. ఈ నదులు ఏటా దాదాపు 33 మిలియన్ ఎకర అడుగుల (MAF) నీటిని తీసుకువెళతాయి. ఇప్పుడు భారత్ ఎలాంటి ఆంక్షలు లేకుండా ఈ నీటిని ఉపయోగించుకోవచ్చు.