యాలకులలో మెలటోనిన్ కనిపిస్తుంది. ఇది జీవక్రియను పెంచుతుంది. ఇది కేలరీలను వేగంగా బర్న్ చేస్తుంది. ఆమ్లత్వం నుండి ఉపశమనం అందిస్తుంది. ఈ పానీయం కొవ్వు కాలేయం యొక్క లక్షణాలను తిప్పికొట్టడంలో సహాయపడుతుంది. సోంపు గింజలు శరీరాన్ని చల్లబరుస్తాయి. ముఖ్యంగా వేసవిలో సోంపు గింజలతో తయారు చేసిన ఈ పానీయాన్ని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీరాన్ని లోపల నుండి చల్లగా ఉంచుతుంది.
బరువు తగ్గించే పానీయం ఎలా తయారు చేయాలి?
కావలసినవి
దనియాలు - 1 టీస్పూన్
అల్లం - 1 అంగుళం
సోంపు గింజలు - 1 టీస్పూన్
దాల్చిన చెక్క - 1 చిన్న ముక్క
ఏలకులు - 2
నీళ్ళు - 2 కప్పులు
ఎలా తయారు చేయాలి..?
ముందుగా ఒక గిన్నెలో మంచి నీళ్లు తీసుకోవాలి. అందులో దనియాలు, అల్లం, సోంపు, దాల్చిన చెక్క, యాలకులు కూడా జోడించాలి.దీనిని 7 నుంచి పది నిమిషాల పాటు మరిగించాలి.తర్వాత ఈ నీటిని వడకట్టి, గోరువెచ్చగా ఉన్నప్పుడే ఖాళీ కడుపుతో తాగితే చాలు. రెండు నెలల పాటు తాగితే.. ఈజీగా బరువు తగ్గవచ్చు.