3. కొంతమంది చదవాల్సిన సబ్జెక్ట్ ఎక్కువగా ఉండటం వల్ల ఒత్తిడికి లోనవుతారు. చదివిన విషయం సరిగ్గా అర్థం కాకపోవడం వల్ల కూడా మతిమరుపు కలగవచ్చు. ఇలాంటి సమస్య ఉన్న వారు మదర్ టంగ్ అంటే తెలుగు, హిందీ ఇలా ఎవరి భాషలో వారు సబ్జెక్ట్ చదివితేనే సులభంగా గుర్తుపెట్టుకోగలరని నిపుణులు సూచిస్తున్నారు.
4. చదివింది ఈజీగా గుర్తుండాలంటే ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ప్రతిరోజూ కొంతసేపు రివిజన్ చేసుకోవడం వల్ల మెమరీ పెరుగుతుంది. పరీక్షల సమయంలో ప్రశాంతంగా ఉండటం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, చక్కటి నిద్ర వల్ల ఒత్తిడి తగ్గి చదివిందంతా గుర్తుంటుంది.