మహిళల శరీరాలు 35 ఏళ్లు దాటిన తరువాత బలహీన పడతాయి. అలాగే శరీరంలో వివిధ హార్మోన్ల మార్పులకు లోనవుతుంది. ఎముకలు బలహీనపడడం మొదలవుతుంది. అందుకే ఆ సమయంలో వారి శరీరానికి ఇనుము, ప్రోటీన్, క్యాల్షియంతో సహా ఎన్నో పోషకాలు అవసరం. ఇంట్లోని మహిళలు తమ కోసం సమయం కేటాయించుకోకుండా కుటుంబ సభ్యులకే కేటాయిస్తారు. దీనివల్ల వారికి అనేక పోషకాహార లోపం కూడా వస్తుంది. అందుకే వారు ప్రతిరోజు కచ్చితంగా తినాల్సిన ఆహారం నానబెట్టిన పెసర మొలకలు.
పెసరపప్పును నానబెడితే మొలకలు వస్తాయి. వీటిని ఆరోగ్యకరమైన పోషకాలు నిండుగా ఉన్న ఆహారంగా చెప్పుకుంటారు. ఇవి శాఖాహారులకు, మాంసాహారులకు కూడా ఎంతో ముఖ్యం. దీనిలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అలాగే విటమిన్ b6, విటమిన్ సి, ఐరన్, ఫైబర్, పొటాషియం, రాగి, ఫోలేట్, మెగ్నీషియం, నియాసిన్, థయామిన్, భాస్వరం వంటివి కూడా ఉంటాయి. 35 ఏళ్లు దాటిన మహిళలు తమ శక్తిని పెంచుకోవడానికి ప్రోటీన్ లాభం రాకుండా అడ్డుకోవడానికి నానబెట్టిన పెసర మొలకలు తినాల్సిన అవసరం ఉంది.