తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని జుట్టుకు, కుదుళ్లకు పట్టించి మెల్లగా మసాజ్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని జుట్టుపై కనీసం 5 నుండి 7 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. దీనివల్ల జుట్టులోని మురికి పోవడమే కాకుండా, పోషకాలు లోపలికి చేరుతాయి.ఆ తర్వాత సాధారణ నీటితో జుట్టును శుభ్రంగా కడుక్కోవాలి.
ఈ బియ్యం నీటిని జుట్టుకు వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు..
మెరుపు (Shine): బియ్యం నీరు జుట్టుకు సహజమైన మెరుపును ఇస్తుంది.
బలం: జుట్టు కుదుళ్లు దృఢంగా మారి, జుట్టు రాలడం తగ్గుతుంది.
మృదుత్వం: రోజ్ వాటర్ జుట్టును తేమగా ఉంచి, చిక్కులు పడకుండా చేస్తుంది.
ముఖ్యమైన జాగ్రత్తలు:
మైల్డ్ షాంపూ: మీ జుట్టు డ్యామేజ్ అవ్వకూడదు అంటే.. వీలైనంత వరకు గాఢత తక్కువగా ఉండే (Mild) షాంపూని ఎంచుకోవడం మంచిది.
ప్యాచ్ టెస్ట్: మీరు మొదటిసారి బియ్యం నీరు లేదా రోజ్ వాటర్ ఉపయోగిస్తుంటే, ముందుగా తల మీద ఒక చిన్న భాగంలో ప్యాచ్ టెస్ట్ చేసి, మీకు ఎలాంటి అలర్జీ లేదని నిర్ధారించుకున్నాకే పూర్తిస్థాయిలో వాడండి.
వారానికి ఎన్నిసార్లు?: ఉత్తమ ఫలితాల కోసం వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఈ పద్ధతిని అనుసరించవచ్చు.