చిక్కమగళూరు తాలూకా మాచగొండన హళ్లి ప్రభుత్వ స్కూల్లో పెద్ద ఆటస్థలం ఉంది. కావాల్సినంత మంది టీచర్లు ఉన్నారు. 250 మందికి పైగా పిల్లలు చదువుకుంటున్నారు. పవిత్రమైన రంజాన్ పండుగలో దానం, ధర్మం చేయడానికి బదులుగా మూడేళ్లుగా నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న పిల్లలకు సాయం చేయాలని అనుకున్నారు. ఈ సమస్య గురించి పెద్ద ఆఫీసర్లకు చెబితే పట్టించుకోలేదు. పంచాయితీకి చెబితే 3 రోజులకోసారి నీళ్లు ఇచ్చేవాళ్లు. అందుకే ఈ స్కూల్ టీచర్లు హీనా తబ్సుమ్, రజియా సుల్తాన్ ఇద్దరూ కలిసి ఈ గొప్ప పని చేయాలనుకున్నారు.