ఆ తర్వాత ఒక చిన్న కడాయిలో నూనె వేసి ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసి పోపు పెట్టాలి. అవి చిటపటలాడాక, తరిగిన అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, జీడిపప్పు వేసి వేయించాలి. ఆ మిశ్రమాన్ని నానబెట్టిన ఇడ్లీ పిండిలో వేసి, దానితో పాటు 1 టేబుల్ స్పూన్ తురిమిన కొబ్బరి కూడా వేసి బాగా కలుపుకోవాలి.